సరిహద్దు ఉద్రిక్తతలపై అఖిలపక్షం
న్యూఢిల్లీః
సరిహద్దుల్లో
నెలకొన్న
ఉద్రిక్త
పరిస్తితులపై
ప్రధాని
వాజ్పేయి
ఆదివారం
నాడు
అఖిల
పక్ష
సమావేశం
ఏర్పాటు
చేశారు.
ప్రధాన
రాజకీయ
పార్టీలకు
చెందిన
12
మంది
నేతలను
ఈ
సమావేశానికి
ఆహ్వానించినట్టుగా
పార్లమెంటరీ
వ్యవహారాల
మంత్రి
ప్రమోద్మహాజన్
చెప్పారు.
కాంగ్రెస్ నేత సోనియాగాంధీ, ఆ పార్టీకి చెందిన డాక్టర్ మన్మోహన్సింగ్, తెలుగుదేశం పార్టీ నేత ఎర్రన్నాయుడు, సిపిఎం నాయకుడు సోమనాథ్చటర్జీ, సిపిఐ నేత అజయ్ చక్రవర్తి, ఎస్పి నేత ములాయంసింగ్ యాదవ్, బిఎస్పి నాయకులు మాయవతి, ఐఎఐడిఎంకె నేత పాండియన్, నేషనలిస్ట్ కాంగ్రెస్ నాయకులు శరద్పవార్, ఆర్ఎస్పి ప్రతినిధి రఘవంశ్ ప్రసాద్సింగ్, టిఎంసి నేత మమతాబెనర్జీ ఈ సమావేశంలో పాల్గొంటారు. హోం మంత్రి అద్వానీ, విదేశాంగ మంత్రి జస్వంత్సింగ్, ఆర్ధిక మంత్రి యశ్వంత్సిన్హా, జాతీయ భద్రతావ్యవహారాల సలహాదారు బ్రిజేష్మిశ్రా ఈ సమావేశంలో పాల్గొంటారు.