వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీని కమ్ముకున్న పొగమంచు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేయడంతో సాధారణ జనజీవనం దాదాపుగా స్తంభించిపోయింది. గతరెండురోజులుగా రైళ్లు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు వల్ల ఢిల్లీ జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కనీసం పాతిక విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

విమానాల రాకపోకల్లో గంటలకొద్ది జాప్యం జరుగుతుండటంతో ప్రయాణికులు నానాఇక్కట్లు
పడుతున్నారు. రాజధానికి వచ్చే రైళ్లు, రాజధానినుంచి బయలుదేరే రైళ్లలో కూడా గంటలకొద్ది జాప్యం జరుగుతున్నది. పొడి శీతల పవనాల కారణంగా మరో రెండు మూడు రోజులు ఢిల్లీకి ఈ పొగమంచి బాధ తప్పదని వాతావరణ కేంద్రం అధికారులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X