వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుమతి కోరిన ముషారఫ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః ఖాట్మండు సార్క్‌ సదస్సులో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్తున్న తమ దేశాధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ విమానం భారత గగనతలం నుంచి ప్రయాణించేందుకు అనుమతినివ్వాలని పాకిస్తాన్‌ ప్రభుత్వం అధికారికంగా భారత్‌కు విజ్ఞప్తి చేసింది.

తమ విజ్ఞప్తిని భారత్‌ సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా పాకిస్తాన్‌ డిప్యూటీ హై కమిషనర్‌ జలీల్‌ అబ్బాస్‌ జిలానీ చెప్పారు. పాక్‌ కోరితే ముషారఫ్‌ విమానం భారత గగనతలం మీదుగా ఖాట్మండు వెళ్లడానికి అనుమతిస్తామని భారత్‌ ఇదివరకే ప్రకటించింది. పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న టెర్రరిస్టుల జాబితాను పాక్‌ ప్రభుత్వానికి అందజేసి వారిపై చర్యతీసుకోవాలని డిమాండ్‌ చేసినట్టుగా భారత్‌ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ తమకు మాత్రం అలాంటి జాబితా ఏదీ ఇప్పటివరకు అందలేదని జిలానీ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X