వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అనుమతి కోరిన ముషారఫ్
ఇస్లామాబాద్ః
ఖాట్మండు
సార్క్
సదస్సులో
పాల్గొనేందుకు
బయలుదేరి
వెళ్తున్న
తమ
దేశాధ్యక్షుడు
పర్వేజ్
ముషారఫ్
విమానం
భారత
గగనతలం
నుంచి
ప్రయాణించేందుకు
అనుమతినివ్వాలని
పాకిస్తాన్
ప్రభుత్వం
అధికారికంగా
భారత్కు
విజ్ఞప్తి
చేసింది.
తమ విజ్ఞప్తిని భారత్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా పాకిస్తాన్ డిప్యూటీ హై కమిషనర్ జలీల్ అబ్బాస్ జిలానీ చెప్పారు. పాక్ కోరితే ముషారఫ్ విమానం భారత గగనతలం మీదుగా ఖాట్మండు వెళ్లడానికి అనుమతిస్తామని భారత్ ఇదివరకే ప్రకటించింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న టెర్రరిస్టుల జాబితాను పాక్ ప్రభుత్వానికి అందజేసి వారిపై చర్యతీసుకోవాలని డిమాండ్ చేసినట్టుగా భారత్ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ తమకు మాత్రం అలాంటి జాబితా ఏదీ ఇప్పటివరకు అందలేదని జిలానీ చెప్పారు.
Comments
Story first published: Saturday, December 29, 2001, 23:53 [IST]