యుద్ధ నివారణకే ప్రాధాన్యం: వాజ్పేయి
న్యూఢిల్లీ:
పాకిస్థాన్తో
యుద్ధాన్ని
నివారించడానికి
చేయాల్సిందింతా
చేస్తామని
ప్రధాని
అటల్
బిహారీ
వాజ్పేయి
అన్నారు.
అయితే,
ప్రజలు
ఏ
పరిస్థితిని
ఎదుర్కోవడానికి
సిద్ధం
కావాలని
ఆయన
పిలుపునిచ్చారు.
సీమాంతర
ఉగ్రవాదంపై
బహుముఖ
వ్యూహంతో
పోరు
సాగిస్తుందని
ఆయన
చెప్పారు.
సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపేయాలని పాకిస్థాన్పై ఒత్తిడి తేవాలని ఆయన అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. న్యూఢిల్లీలో ఏర్పాటయిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్లోని, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని పాకిస్థాన్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదాన్ని రూపుమాపడమే తమ లక్ష్యమని, ఈ లక్ష్య సాధనకు అన్ని పద్ధతులను, వనరులను ఉపయోగించడం అవసరమని ఆయన అన్నారు.
పాకిస్థాన్తో యుద్ధాన్ని నివారించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నప్పటికీ సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఏ మార్గాన్ని కూడా వదలకూడదని ఆయన అన్నారు.