వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ ఎమ్యెల్యే రాగ్యానాయక్‌ హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నల్లగొండ జిల్లా దేవరకొండ కాంగ్రెస్‌ శాసనసభ్యుడు ధీరావత్‌ రాగ్యా నాయక్‌ హత్యకు గురయ్యారు. శనివారం మధ్యాహ్నం ఆయనను మహబూబ్‌నగర్‌ జిల్లా మద్దిమడుగు గ్రామంలో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. పీపుల్స్‌వార్‌ నక్సలైట్లే ఈ ఘాతుకానికి పాల్పడి వుంటారని భావిస్తున్నారు.

రాగ్యానాయక్‌ స్థానికంగా జరిగే జాతరలో పాల్గొనడానికి మద్దిమడుగుల గ్రామం వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. దుండగులు రాగ్యానాయక్‌ గన్‌మన్‌ నుంచి గన్‌ను లాక్కుని ఆయనను హత్య చేశారు. ఈ సంఘటనలో గన్‌మన్‌ కూడా మరణించాడు.

మద్దిమడుగు చాలా మారుమూల గ్రామమని, తాను ఆ గ్రామం వెళ్తున్నట్లు జిల్లా పోలీసులకు సమాచారం లేదని అంటున్నారు. పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు ఆ ప్రాంతంలో మందుపాతరలు కూడా అమర్చి వుంటారని మహబూబ్‌ నగర్‌ జిల్లా పోలీసులు అంటున్నారు. ఇటువంటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు తమకు సమాచారం ఇవ్వడం అవసరమని వారి వాదన.

రాగ్యానాయక్‌ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు హత్యకు గురైనట్లు సమాచారం. దాదాపు రెండున్నర గంటలకు గానీ పోలీసులకు ఈ విషయం తెలియలేదని అంటున్నారు. రాగ్యానాయక్‌ మృతదేహాన్ని ఆ మారుమూల గ్రామం నుంచి తేవడం కూడా కష్టమనేది ఒక వాదన.

రాగ్యానాయక్‌ రాష్ట్ర శాసనసభకు ఎస్‌టిలకు రిజర్వ్‌ చేసిన నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం నుంచి మొదటి సారి ఎన్నికయ్యారు. ఆయన నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడుగా కూడా పని చేశారు.

పీపుల్స్‌వార్‌ నక్సలైట్లతో చర్చలు జరపడానికి ప్రభుత్వం శనివారం అంగీకారం తెలియజేసిన నేపథ్యంలో ఈ సంఘటన జరగడం గమనార్హం. కాగా, నక్సలైట్లతో ప్రభుత్వం చర్చలు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. నక్సలైట్లతో చర్చలు ప్రభుత్వం చర్చలు జరపాలని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు ఇటీవల పదే పదే డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ శాసనసభ్యుడు హత్యకు గురయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X