వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్‌టిడి రేట్లు సగానికి పైగా తగ్గింపు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎస్‌టిడి (సబ్‌స్క్రయిబర్‌ ట్రంక్‌ డయలింగ్‌) టెలిఫోన్‌ రేట్లు సగానికి పైగా తగ్గుతున్నాయి. దీని వల్ల ప్రభుత్వ ఆధీనంలోని బిఎస్‌ఎన్‌ఎల్‌కు ఆరు నెలల కాలంలో దాదాపు మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుంది.

ఉత్తరప్రదేశ్‌తో సహా నాలుగు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఎస్‌టిడి టెలిఫోన్‌ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పగటి పూట రేట్లను 60 శాతానికి పైగా తగ్గుతాయి. రాత్రి పూట రేట్లు స్వల్పంగా తగ్గుతాయి.ఈ కొత్త రేట్లు జనవరి 14వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని, దీని వల్ల భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌)కు దాదాపు మూడు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని కమ్యూనికేషన్ల మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ శుక్రవారం విలేకరులతో చెప్పారు.

లాంగ్‌ డిస్టాన్స్‌ కాల్‌ ట్రాఫిక్‌లో భారీ పెరుగుదల వల్ల ఈ లోటు భర్తీ కాగలదని అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. పీక్‌ అవర్స్‌లో తొమ్మిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు 200-500 దూరం స్లాబ్‌ను రు. 11.60 పైసల నుంచి రూ. 4.80 పైసలకు, నాన్‌- పీక్‌ అవర్స్‌లో టారిఫ్‌ను మూడు రూపాయల నుంచి రూ. 2.40 పైసలకు తగ్గిస్తున్నారు. నాన్‌ పీక్‌ అవర్స్‌లో రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు టారిఫ్‌లో మార్పు లేదు. ఇది రూ. 1.20 పైసలే వుంటుంది.

పీక్‌ అవర్స్‌లో 500 కిలోమీటర్ల పైబడి దూరానికి నిమిషానికి తొమ్మిది రూపాయలు వసూలు చేస్తారు. ఇంతకు ముందు 500- 1000 కిలో మీటర్ల మధ్య దూరానికి రూ. 17.56 పైసలు, వేయి కిలోమీటర్ల పైబడి దూరానికి 24 రూపాయలు వసూలు చేసేవారు. నాన్‌ పీక్‌ అవర్స్‌లో 500- 1000 కిలోమీటర్ల మధ్యదూరానికి రూ. 4.50 పైసలు, వేయి కిలోమీటర్ల పైబడి దూరానికి ఆరు రూపాయలు వసూలు చేస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X