వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరిన్ని దాడులకు ప్లాన్‌: ఢిల్లీలో హై అలర్డ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తీవ్రవాదులు మరిన్ని దాడులకు, పేలుళ్లకు పాల్పడవచ్చుననే సమాచారం అందడంతో రాజధాని ఢిల్లీ నగరంలో భద్రతను మరింత అప్రమత్తం చేశారు.

లష్కర్‌- ఎ- తోయిబా, జైష్‌-ఎ- మహ్మద్‌, ఆల్‌- ఉమర్‌ ముజాహిదీన్‌ తీవ్రవాదులు మరిన్ని పేలుళ్లకు, దాడులకు పాల్పడవచ్చుననే సమాచారం భారత భద్రతా దళాలకు అందింది. ఈ సంస్థలకు సంబంధించిన ఇద్దరిని అనుమానంతో అరెస్టు చేశారు. ఈ సంస్థల ఆత్మాహుతి దళాలు వివిఐపిల మీద, ప్రముఖ ప్రాంతాల్లో దాడులు చేయవచ్చునే
సమాచారం అందినట్లు తెలుస్తోంది. కాశ్మీర్‌ హౌస్‌, ఆర్మీ హౌసింగ్‌ ఇంజనీరింగ్‌ విభాగంపై దాడులకు ఈ సంస్థలు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. అఎn్ఘాన్‌ జాతీయులతో, కరుడు గట్టిన కాశ్మీరీ యువకులతో 14 మంది చొప్పున బృందాలుగా ఏర్పడినట్లు సమాచారం. ఢిల్లీ శివారులో ఇద్దర్ని అనుమానంతో అరెస్టు చేసి సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీలు ఇంటరాగేట్‌ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X