ఎమ్మెల్యే కాల్చివేత: వార్ పనే!
హైదరాబాద్:
కాంగ్రెస్
శాసనసభ్యుడు
రాగ్యానాయక్ను
పీపుల్స్వార్
నల్లమల
దళం
కాల్చి
చంపినట్లు
ప్రత్యక్ష
సాక్షులు
చెపుతున్నారు.
ఆమ్రాబాద్
మండలం
మద్దిమడుగు
గ్రామానికి
హనుమాన్
జాతరలో
పాల్గొనడానికి
ఆయన
తన
భార్యతో
కలిసి
వెళ్లారు.
శాసనసభ్యుడు ఎక్కడని ఆయన గన్మన్ను నక్సల్స్ అడుగుతుండగా తన గురించి వాకబు చేస్తున్నది ఎవరంటూ రాగ్యానాయక్ గుడి నుంచి బయటకు రాగానే నక్సల్స్ కాల్చి చంపారు. గ్రెనేడ్లు, ఇతర మారణాయుధాలతో నక్సల్స్ అక్కడికి వెళ్లారు. తన భర్త హత్య గురించి రాగ్యానాయక్ భార్య ఆమ్రాబాద్ పోలీసులకు శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో తెలియజేశారు.
రాగ్యానాయక్ ఐదుగురు కుమారులు హైదరాబాద్లోనే వుంటారు. తమ తండ్రి హత్య గురించి విని వారు షాక్ గురయ్యారు. రాగ్యానాయక్ కుమారులు ఇద్దరు వెంటనే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని కలుసుకున్నారు. తమ దుఃఖాన్ని, ఆగ్రహాన్ని వెళ్లబోసుకున్నారు.తమ తండ్రి రాగ్యానాయక్ నక్సల్స్ టార్గెట్లో లేరని ఆయన కుమారుడు చెప్పారు. రాగ్యానాయక్ కుమారులు బోరు బోరున విలపిస్తూ తమ తండ్రి ఏం అన్యాయం చేశారో చెప్పాలని నక్సల్స్ను డిమాండ్ చేశారు. తమ తండ్రి ఎవరికీ ద్రోహం చేయలేదని వారన్నారు. నల్లగొండ జిల్లా శాసనసభ్యులు వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు.
రాగ్యానాయక్ హత్యను రాజశేఖర్ రెడ్డి ఖండించారు. రాగ్యానాయక్ లేని లోటు తీరేది కాదని ఆయన అన్నారు. ఈ విధమైన అన్యాయమైన కార్యక్రమాలకు పాల్పడుతున్న తీవ్రవాదులు తమ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లలేరని ఆయన అన్నారు.
కాంగ్రెస్ శాసనసభ్యుడు రాగ్యానాయక్ను పీపుల్స్వార్ నక్సలైట్లు కాల్చి చంపడాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఖండించారు. సిపిఎం కార్యదర్శి బి.వి. రాఘవులు, సిపిఐ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా ఈ హత్యను ఖండించారు. రాగ్యానాయక్ హత్యను హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ ఖండించారు. నాయక్ మృతికి ఆయన తన తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాగ్యానాయక్ హత్యను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు ఖండించారు. నాయక్ మృతికి ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.