ప్రతిపక్షాల కోసమే జార్జిగైర్హాజర్
న్యూఢిల్లీ:
ఇండో-
పాక్
సంబంధాలపై
చర్చించడానికి
ఏర్పాటయిన
అఖిల
పక్ష
సమావేశానికి
హాజరు
కావాలని
రక్షణ
మంత్రి
జార్జి
ఫెర్నాండెజ్పై
తాను
ఒత్తిడి
తేలేదని
ప్రధాని
అటల్
బిహారీ
వాజ్పేయి
చెప్పారు.
దేశమంతా
ఏకతాటిపై
నిలబడాల్సిన
ప్రస్తుత
తరుణంలో
ఫెర్నాండెజ్
వ్యవహారంపై
ప్రతిపక్షాల
రాద్ధాంతం
వుండకూదనే
ఉద్దేశంతోనే
ఫెర్నాండెజ్
హాజరును
పెద్దగా
పట్టించుకోలేదని
ప్రధాని
అన్నారు.
రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఫెర్నాండెజ్ అఖిల పక్ష సమావేశానికి ఎందుకు రాలేదని విలేకరులు అడిగినప్పుడు- సమావేశానికి హాజరు కావాలని ప్రధాని వాజ్పేయి ఫెర్నాండెజ్ను అడిగి వుండవచ్చునని, అయితే ప్రతిపక్షాలు గొడవ చేయకూడదని భావించి వుంటారని నేషనలిస్టు పార్టీ నాయకుడు పి.ఎ. సంగ్మా చెప్పారు. ఆర్మీ ఫార్మేషన్స్ను సందర్శించడానికి ఫెర్నాండెజ్ అనుమతి అడిగారని ప్రధాని చెప్పినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్ మహాజన్ చెప్పారు.
శవపేటికల కొనుగోలు కుంభకోణానికి బాధ్యత వహించి ఫెర్నాండెజ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు ఆయన ఉన్న సమావేశాలను బహిష్కరిస్తూ వస్తున్నాయి.