వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అసెంబ్లీ డిప్యూటీస్పీకర్ హరీశ్వర్
హైదరాబాద్:
రాష్ట్ర
శాసనసభ
డిప్యూటీ
స్పీకర్
పదవికి
తెలుగుదేశం
పార్టీ
తన
అభ్యర్థిగా
రంగారెడ్డి
జిల్లా
పరిగి
శాసనసభ్యుడు
హరీశ్వరరెడ్డిని
రంగంలోకి
దింపింది.
నామినేషన్లు
గడువు
ఆదివారం
సాయంత్రం
ఐదు
గంటలకు
ముగిసింది.
గడువులోగా హరీశ్వర రెడ్డి మినహా మరెవరూ నామినేషన్లు వేయలేదు. దీంతో హరీశ్వర రెడ్డి డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయినట్లే. హరీశ్వర రెడ్డి ఎన్నికను స్పీకర్ కె. ప్రతిభా భారతి సోమవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో ప్రకటిస్తారు.
డిప్యూటీ స్పీకర్గా వున్న కె. చంద్రశేఖర్ రావు తన పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీ అయింది. ఈ ఖాళీ భర్తీకి ఆదివారం ఎన్నికల ప్రక్రియను స్పీకర్ ప్రకటించారు.
Comments
Story first published: Sunday, December 30, 2001, 23:53 [IST]