వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదంపై నిర్ణయాత్మక పోరు:పిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా త్వరలోనే నిర్ణయాత్మక యుద్ధం ప్రారంభించనున్నట్లు ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి చెప్పారు. తన నివాసంలో ఆదివారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు. సమావేశం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఈ సమావేశానికి పది మంది నాయకులు హాజరైనట్లు, సమావేశం రెండు గంటల పాటు సాగినట్లు ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు సహకార వైఖరి అవలంభించాయని, నిర్మాణాత్మక సూచనలు చేశాయని ఆయన చెప్పారు.
ప్రభుత్వ అనుసరించే చర్యల ప్రతిపాదనలను వివరించడానికి ఆయన నిరాకరించారు. అయితే, ప్రజల ఇష్టాల ప్రకారమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిర్ణయాలు తీసుకునే ముందు ప్రతిపక్షాలను సంప్రదిస్తామని ఆయన చెప్పారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న వైఖరిని ప్రపంచ నాయకులు ప్రశంసిస్తున్నారని, ప్రపంచ సమాజంలో పాకిస్థాన్‌ ఏకాకి అయిందని ఆయన అన్నారు. ఆ దేశంలోని ఉగ్రవాద గ్రూప్‌లపై పాకిస్థాన్‌ కఠిన చర్యలు తీసుకోవాల్సి వుంటుందని ఆయన చెప్పారు.
రానున్న సార్క్‌ సదస్సులో ఇండో- పాక్‌ సంబంధాలు చర్చకు రావని ఆయన అన్నారు. ఆ సందర్భంగా వాజ్‌పేయి, పాకిస్థాన్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ మధ్య భేటీ వుండదని కూడా ఆయన స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X