రాగ్యా హత్యకుఅసెంబ్లీ ఖండన
హైదరాబాద్:
కాంగ్రెస్
శాసనసభ్యుడు
ధీరావత్
రాగ్యానాయక్
నక్సలైట్లు
హత్య
చేయడాన్ని
అసెంబ్లీ
ముక్తకంఠంతో
ఖండించింది.
ఆయన
మృతికి
శాసనసభ
ఆదివారం
సంతాపం
ప్రకటించింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంతాపతీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. నక్సలైట్లు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదని ముఖ్యమంత్రి అన్నారు. వాళ్ల వల్ల ఎవరికీ వుపయోగం వుండదని ఆయన అన్నారు. ఈ విధమైన హత్యకాండకు స్వస్తి చెప్పాల్సిన అవసరం వున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నంలో భాగంగనే మనం రాగ్యానాయక్ను పోగొట్టుకున్నామని ఆయన అన్నారు. చాలా మందిని పోగొట్టుకోక ముందే మనం జాగ్రత్త పడాల్సిన అవసరం వున్నదని ఆయన అన్నారు.
నక్సలైట్లు రాగ్యానాయక్ను హత్య చేయడం తీవ్రవాద చర్య తప్ప మరేమీ కాదని సిఎల్పి నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. సిద్ధాంతం కోసం రాగ్యానాయక్ను నక్సలైట్లు చంపారని చెప్పడానికి తాము సిద్ధంగా లేమని ఆయన అన్నారు.
మనం అనుసరిస్తున్న విఫలమైందనడానికి రాగ్యానాయక్ హత్య ఉదాహరణ అని, సమస్యను కొత్త కోణంతో పరిష్కరించే యత్నం చేయడం అవసరమని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) సభ్యుడు కె. చంద్రశేఖర్ రావు అన్నారు. సిపిఎం సభ్యుడు నోముల నరసింహయ్య, బిజెపి సభ్యుడు ఎన్. ఇంద్రసేనా రెడ్డి రాగ్యానాయక్ హత్యను ఖండించారు. రాగ్యానాయక్ మృతికి సంతాప సూచకంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది.