వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివిఐపిల హత్యకు ఢిల్లీలో తీవ్రవాదులు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీతో పాటు కొంత మంది వివిఐపిలను హత్య చేయడానికి 11 మందితో కూడిన తీవ్రవాద బృందం రాజధాని నగరంలో ప్రవేశించిందనే సమాచారం అందుకున్న భద్రతా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. లష్కర్‌-ఎ- తోయిబా, ఆల్‌ ఖయిదా తీవ్రవాదుల బృందం నూతన సంవత్సరం సందర్భంగా విధ్వంసం సృష్టించడానికి ఢిల్లీలో ప్రవేశించినట్లు భద్రతాధికారులకు సమాచారం అందింది.

ప్రముఖ శాఖలన్నింటికీ ఈ సమాచారం అందించినట్లు, అద్వానీ ఎక్కడికైనా వెళ్లినప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. జనవరి నెల మధ్య లోగా లక్ష్యాన్ని నెరవేర్చేందుకు తీవ్రవాదుల బృందం ఢిల్లీలో అడుగు పెట్టినట్లు సమాచారం. విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రి ఒమర్‌ అబ్దుల్లా భద్రతను కూడా పెంచారు.

ఈ పరిణామాలపై పోలీసులు పెదవి విప్పడం లేదు. అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకోవడానికి గత కొద్ది రోజులుగా దక్షిణ, తూర్పు ఢిల్లీలో దాడులు జరుగుతున్నాయి.
లష్కర్‌-ఎ- తోయిబా మిలిటెంట్‌ను ఒకరిని అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్‌ చేసినప్పుడు 11 మందితో కూడా తీవ్రవాదుల బృందం ఢిల్లీలో ప్రవేశించినట్లు తెలిసిందని సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X