వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లష్కర్‌ అధినేతఅరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః లష్కర్‌ ఎ తోయిబా అగ్రనేత హఫీజ్‌ మహమ్మద్‌ సయీద్‌ను పాకిస్తాన్‌ పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్న ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేసినట్టుగా పోలీసులు చెప్పారు.

లష్కర్‌, మరో తీవ్రవాద సంస్థ జైష్‌ భారత పార్లమెంట్‌పై జరిగిన దాడికి బాధ్యులుగా భారత్‌ ఆరోపిస్తున్న విషయం విదితమే. ఈ రెండు సంస్థలపై చర్యకు తొలుత మొరాయించిన పాకిస్తాన్‌ అంతర్జాతీయ వత్తిడి తీవ్రం కావడంతో దిగివచ్చింది. దేశంలోని టెర్రరిస్టు మూకలను ఏరివేసే కార్యక్రమంలో భాగంగా లష్కర్‌ అధినేతను అరెస్టు చేసినట్టుగా పాకిస్తాన్‌ భద్రతాదళాలు తెలిపాయి.

జైష్‌ అధినేత మౌలానా మసూద్‌ అజార్‌ను కూడా పాకిస్తాన్‌ ఇప్పటికే గృహనిర్బంధంలో వుంచింది. దేశీయ చట్టాలకింద వీరిని అరెస్టు చేస్తున్నా భారత్‌ కోరిన విధంగా అప్పగించాలంటే భారత్‌తో టెర్రరిస్టు కార్యకలాపాలతో సంబంధం వున్నట్టుగా నిరూపించే సాక్ష్యాలను తమకు అందించాల్సివుంటుందని పాకిస్తాన్‌ అంటున్నది. భారత్‌ సాక్ష్యాలు అందిస్తే తప్ప తాము అరెస్టు చేసిన టెర్రరిస్టు నాయకులను భారత్‌కు అప్పగించే విషయం ఆలోచించడం సాథ్యం కాదని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X