వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ దౌత్యాధికారిఅరెస్టు,విడుదల

By Staff
|
Google Oneindia TeluguNews

ఖాట్మండూః నకిలీ భారత కరెన్సీ కలిగివున్నారనే ఆరోపణపై పాకిస్తాన్‌ కు చెందిన దౌత్యాధికారి ఒకరిని నేపాల్‌ పోలీసులు అరెస్టు చేయడం పెను వివాదానికి దారితీసింది. సార్క్‌ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన పాక్‌ దౌత్యాధికారి వద్ద నకిలీ 500 రూపాయల నోట్లు వుండడంతో ఆయనను నేపాల్‌ పోలీసులు అరెస్టు చేశారు. భారత్‌ తమపై కుట్రపన్ని ఈ అరెస్టు చేయించిందని పాకిస్తాన్‌ మండి పడింది. అయితే తాము పొరపాటున పాక్‌ అధికారిని అరెస్టు చేశామని నేపాల్‌ ఆ తరువాత క్షమాపణ చెప్పడంతో సమస్య సద్దు మణిగింది.

పాక్‌ అధికారి వద్ద 96 నకిలీ 500 రూపాయల నోట్లు వుండడంతో ఆయనను అరెస్టు చేసినట్లు నేపాల్‌ పోలీసులు చెప్పారు. అయితే ఆ అధికారిని గుర్తించడంలో పొరపాటు జరిగిందని నేపాల్‌ ఆ తరువాత సారీ చెప్పింది. ఆ అధికారిని విడుదల చేసింది. అవకాశం చిక్కినప్పుడల్లాల పాకిస్తాన్‌ భారత్‌ పై బురదచల్లేందుకు ప్రయత్నిస్తుందనేందుకు ఉదాహరణగా పాక్‌ భారత్‌ పై నేపాల్‌ లో కూడా అవాకులు చెవాకులు పేలింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X