వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ దౌత్యాధికారిఅరెస్టు,విడుదల
ఖాట్మండూః నకిలీ భారత కరెన్సీ కలిగివున్నారనే ఆరోపణపై పాకిస్తాన్ కు చెందిన దౌత్యాధికారి ఒకరిని నేపాల్ పోలీసులు అరెస్టు చేయడం పెను వివాదానికి దారితీసింది. సార్క్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన పాక్ దౌత్యాధికారి వద్ద నకిలీ 500 రూపాయల నోట్లు వుండడంతో ఆయనను నేపాల్ పోలీసులు అరెస్టు చేశారు. భారత్ తమపై కుట్రపన్ని ఈ అరెస్టు చేయించిందని పాకిస్తాన్ మండి పడింది. అయితే తాము పొరపాటున పాక్ అధికారిని అరెస్టు చేశామని నేపాల్ ఆ తరువాత క్షమాపణ చెప్పడంతో సమస్య సద్దు మణిగింది.
Comments
Story first published: Friday, January 4, 2002, 23:53 [IST]