వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌, భారత్‌లపై చర్చలకు ఒత్తిడి

By Staff
|
Google Oneindia TeluguNews

ఖాట్మండు: చర్చలను పునరుద్ధరించుకోవాలని పాకిస్థాన్‌, భారత్‌లపై ఒత్తిడి పెరుగుతోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడానికి సార్క్‌ సదస్సు సందర్భంగా చర్చలు జరపాలని అమెరికా, బ్రిటన్‌లు కోరుతున్నాయి.

ఇరు దేశాల అధినేతలు, మంత్రులు, అధికారులు ఖాట్మండులోనే వున్నందున చర్చలు జరపాలని అమెరికా విదేశాంగ ప్రతినిధి రిచర్డ్‌ బౌచర్‌ అన్నారు. అయితే, భారత్‌ అందుకు సుముఖంగా లేదు. వివాదాస్పద అంశాలకు సార్క్‌ సదస్సు వేదిక కాకూడదని భారత్‌ అంటోంది. తీవ్రవాదాన్ని అణచివేయడంలో పాకిస్థాన్‌కు చిత్తశుద్ధి లేదని భారత విదేశాంగ శాఖ మంత్రి జస్వంత్‌ సింగ్‌ అన్నారు. సార్క్‌ ఏడు దేశాలకు సంబంధించిందని, ద్వైపాక్షిక వివాదాస్పద అంశాలకు, రాజకీయాలకు సార్క్‌ వేదిక కాడూదని ఆయన అన్నారు.

అయితే, భారత్‌ వాదనతో పాకిస్థాన్‌ ఏకీభవించడం లేదు. భారత్‌ ఉద్రిక్తతలను తగ్గించే ప్రకటనలు చేయాలని, తద్వారా చర్చలకు మార్గం ఏర్పడుతుందని పాకిస్థాన్‌ విదేశాంగ ప్రతినిధి అజీజ్‌ అహ్మద్‌ ఖాన్‌ అన్నారు. పాకిస్థాన్‌, భారత్‌లు సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం వున్నదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X