వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేవాదులతో తెలంగాణాకు తేజంః బాబు
వరంగల్ః దేవాదుల ఎత్తిపోతల పథకంతో పాటు పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ త్వరలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. 16వ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన వరంగల్ జిల్లా కే సముద్రంలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు. తెలంగాణా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే దేవాదుల ప్రాజెక్టును సత్వరం పూర్తి చేసేందుకు తెలుగు దేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో వుందని చంద్రబాబు చెప్పారు.
Comments
Story first published: Friday, January 4, 2002, 23:53 [IST]