వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవాదులతో తెలంగాణాకు తేజంః బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌ః దేవాదుల ఎత్తిపోతల పథకంతో పాటు పెండింగ్‌ ప్రాజెక్టులన్నింటినీ త్వరలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. 16వ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన వరంగల్‌ జిల్లా కే సముద్రంలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు. తెలంగాణా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే దేవాదుల ప్రాజెక్టును సత్వరం పూర్తి చేసేందుకు తెలుగు దేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో వుందని చంద్రబాబు చెప్పారు.

దేవాదుల ఎత్తిపోతల పధకం ప్రణాళిక రూపకల్పనకు 50 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చంద్రబాబు హర్షధ్వానాల మధ్య తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబు నేరుగా వారిని అడిగి తెలుసుకుంటున్నారు. ఉపాధ్యాయులు సక్రమంగా పాఠశాలలకు రావడం లేదని విద్యార్థులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడం విశేషం.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X