రాజమండ్రి దేశం మేయర్ చక్రవర్తి
రాజమండ్రిః రాజమండ్రి కార్పొరేషన్ కు జరుగనున్న ఎన్నికల్లో మేయర్ పదవికి తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. మాజీ మంత్రి స్వర్గీయ బత్తిన సుబ్బారావు అల్లుడు ఎం.ఎస్. చక్రవర్తిని తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్ధిగా బరిలోకి దించింది. మేయర్ పదవికి అభ్యర్థిని ఖరారు చేసేందుకు తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి సారిగా రహస్యబ్యాలెట్ విధానాన్ని అమలు చేయడంతో ఎటువంటి రభస లేకుండా చక్రవర్తి ఎంపిక జరిగిపోయింది.
పిసిసి
సంయుక్త
కార్యదర్శి
హర్షకుమార్
పార్టీ
గ్రీన్
సిగ్నల్
ఇచ్చినా
ఇవ్వక
పోయినా
మేయర్
అభ్యర్థిగా
రంగంలోకి
దిగుతానని
ప్రకటించారు.
ఆయన
ఏకంగా
నామినేషన్
కూడా
దాఖలు
చేశారు.
బిజెపికి
9స్థానాలు
కేటాయించేందుకు
తెలుగుదేశం
పార్టీ
సంసిద్ధత
వ్యక్తం
చేయగా
తమకు
మరిన్ని
స్థానాలు
కావాలని
బిజెపి
ఉడుంపట్టు
పడుతున్నది.
అవసరమైతే
స్వతంత్రంగా
నామినేషన్లు
దాఖలు
చేసుకొనేందుకు
బిజెపి
రంగం
సిద్ధం
చేసుకుంటున్నది.
మొత్తం
మీద
శనివారం
నామినేషన్లు
దాఖలు
చేయాల్సి
వుండడంతో
అన్ని
రాజకీయ
పార్టీలు
అభ్యర్థుల
ఎంపికకు
అహర్నిశలు
కసరత్తు
చేస్తున్నాయి.