వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజమండ్రి దేశం మేయర్‌ చక్రవర్తి

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రిః రాజమండ్రి కార్పొరేషన్‌ కు జరుగనున్న ఎన్నికల్లో మేయర్‌ పదవికి తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. మాజీ మంత్రి స్వర్గీయ బత్తిన సుబ్బారావు అల్లుడు ఎం.ఎస్‌. చక్రవర్తిని తెలుగుదేశం పార్టీ మేయర్‌ అభ్యర్ధిగా బరిలోకి దించింది. మేయర్‌ పదవికి అభ్యర్థిని ఖరారు చేసేందుకు తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి సారిగా రహస్యబ్యాలెట్‌ విధానాన్ని అమలు చేయడంతో ఎటువంటి రభస లేకుండా చక్రవర్తి ఎంపిక జరిగిపోయింది.

మేయర్‌ అభ్యర్థితో పాటు 44 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్‌ కంటే ఓ అడుగు ముందుంది. నామినేషన్ల దాఖలుకు శనివారం ఆఖరు రోజు కావడంతో కాంగ్రెస్‌ పార్టీ కూడా 15 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించింది. మేయర్‌ అభ్యర్థి ఎవరనే అంశంపై కాంగ్రెస్‌ పార్టీలో ఇంకా ప్రతిష్ఠంభన నెలకొంది.

పిసిసి సంయుక్త కార్యదర్శి హర్షకుమార్‌ పార్టీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా ఇవ్వక పోయినా మేయర్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగుతానని ప్రకటించారు. ఆయన ఏకంగా నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. బిజెపికి 9స్థానాలు కేటాయించేందుకు తెలుగుదేశం పార్టీ సంసిద్ధత వ్యక్తం చేయగా తమకు మరిన్ని స్థానాలు కావాలని బిజెపి ఉడుంపట్టు పడుతున్నది. అవసరమైతే స్వతంత్రంగా నామినేషన్లు దాఖలు చేసుకొనేందుకు బిజెపి రంగం సిద్ధం చేసుకుంటున్నది. మొత్తం మీద శనివారం నామినేషన్లు దాఖలు చేయాల్సి వుండడంతో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికకు అహర్నిశలు కసరత్తు చేస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X