వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముషారఫ్‌ లేట్‌ - సార్క్‌ సదస్సు వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

ఖాట్మండూః శుక్రవారం ప్రారంభం కావలసిన సార్క్‌ శిఖరాగ్రసదస్సు శనివారం నాటికి వాయిదా పడింది. వాతావరణం సరిగా లేకపోవడంతో చైనా మీదుగా ఖాట్మండూ చేరాల్సిన పాక్‌ సైన్యాధ్యక్షుడు ముషారఫ్‌ సకాలంలో రాలేకపోవడంతో సదస్సును శనివారం నాటికి వాయిదా వేశారు. ఈ మార్పు వల్ల దేశాధినేతల విహార యాత్ర వాయిదా పడింది. ముషారఫ్‌ చైనా మీదుగా శుక్రవారం సాయంత్రానికి ఖాట్మండూ చేరుకున్నారు. సార్క్‌ సదస్సు శనివారం, ఆదివారం జరుగుతుంది.

ఈ సదస్సులో ఉగ్రవాదం ప్రధాన చర్చనీయాంశంగా మారే అవకాశాలున్నాయి. సార్క్‌ సదస్సు సందర్భంగా భారత, పాక్‌ సారధులు సమావేశం అవుతారా లేదా అన్నది ఇంకా సందేహాస్పదంగానే మిగిలింది. ముషారఫ్‌ తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని భారత ప్రధాని వాజ్‌ పేయి తేల్చి చెప్పినప్పటికీ ముషారఫ్‌ ఇంకా అటువంటి ప్రకటన చేయలేదు. ఈ ఇద్దరు నేతలను చర్చల్లోకి దించేందుకు సార్క్‌ చక్కటి వేదిక అని అమెరికా సైతం భావిస్తున్నది. అమెరికా చొరవతో ముషారఫ్‌ - వాజ్‌ పేయి సమావేశం అవుతారామో వేచి చూడాలి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X