వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవర్‌ చార్జీల పెంపు కమిషన్‌ యిష్టం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః విద్యుత్‌ చార్జీలు పెంచాలని ట్రాన్స్‌కో నిరుడు ప్రతిపాదించినా రెగ్యులేటరీ కమిషన్‌ అంగీకరించలేదని ప్రతపక్షాలు ఆ విషయం విస్మరించి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు దుష్ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు.

మున్సిపల్‌ ఎన్నికల తర్వాత ప్రభుత్వం మరోసారి భారీగా విద్యుత్‌ చార్జీలు పెంచడం ఖాయమంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన దుయ్యబట్టారు. ట్రాన్స్‌కో తన ఆదాయం వ్యయం లెక్కలను చూసుకుని రెగ్యులేటరీ కమిషన్‌కు కొన్ని ప్రతిపాదనలను సమర్పిస్తుందని ఆ ప్రతిపాదనల్లోని వాస్తవఅవాస్తవాలను కమిషన్‌ పరిశీలించి అవసరమైతే పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇవ్వగలుగుతుందని అడుగుతుందని ప్రభుత్వం సమాధానంపై ఆధారపడి చార్జీలు పెంచాలా వద్దా అన్న విషయం నిర్ణయిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇంత తంతు వుంటే ప్రతిపక్షాలు మాత్రం చార్జీలు ప్రభుత్వం పెంచేస్తుందని యాగీ చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X