వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాటలు కాదు, చేతలు కావాలి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః పాకిస్తాన్‌ అధినేత చెబుతున్న విషయాలు బాగానే వున్నాయని అయితే ఉద్దేశ్యాలను చేతల్లో కూడా చూపిస్తే అప్పుడు పాకిస్తాన్‌తో చర్చల పునరుద్దరణకు తాము సిద్ధమేనని భారత్‌ స్పష్టం చేసింది.

పాకిస్తాన్‌ ప్రజలను ఉద్దేశించి శనివారం రాత్రి ఆ దేశాధినేత ముషారఫ్‌ చేసిన ప్రసంగంపై రక్షణ మంత్రిత్వ శాఖ కేబినెట్‌ కమిటీ ఆదివారం నాడు చర్చ జరిపింది. కేబినెట్‌ కమిటీ సమావేశం తర్వాత విదేశాంగ మంత్రి జస్వంత్‌సింగ్‌ విలేకరులతో మాట్లాడుతూ, భారత్‌-పాకిస్తాన్‌ మధ్య పెండింగ్‌లో వున్న ద్వైపాక్షిక సమస్యల పరిష్కారానికి తృతీయ పక్షంలో జోక్యం చేసుకునే ఆస్కారం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. తాము డిమాండ్‌ చేసిన 20 మంది టెర్రరిస్టులను అప్పగించే విషయంలో పాకిస్తాన్‌ నిర్ధిష్టంగా ప్రతిస్పందించకపోవడం పట్ల భారత్‌ అసంతృప్తిని వ్యక్తం చేసింది. టెర్రరిజంపై ఉక్కుపాదం మోపుతామని పాక్‌ ప్రకటించడం పట్ల భారత్‌ హర్షం వ్యక్తం చేసింది. భారత్‌తో సహా ప్రపంచంలో ఎక్కడా టెర్రరిజానికి తమ నేల ఉపయోగపడేందుకు అనుమతించమని పాకిస్తాన్‌ ప్రకటించడం మంచి పరిణామమని జస్వంత్‌ సింగ్‌ పేర్కొన్నారు. పాక్‌ నియంత్రణలో వున్న అన్ని భూభాగాలకు ఇది వర్తించాలని ఆయన అన్నారు. మాటల్లో కాకుండా చేతల్లో పాకిస్తాన్‌ చర్యలు తీసుకుంటే పాక్‌తో ద్వైపాక్షిక చర్చల పునరుద్దరణకు తాము సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. చేతలను బట్టే పాకిస్తాన్‌ చిత్తశుద్దిని తాము బేరీజు వేస్తామని చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలను నిరోధించడంలో భారత్‌కు పాకిస్తాన్‌ ఇకనుంచి సహకరిస్తుందని తాము ఆశిస్తున్నట్టుగా తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X