వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ చిత్తశుద్ది నిరూపించుకోవాలి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః సీమాంతర ఉగ్రవాదం నిరోధానికి పాకిస్తాన్‌ ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో మరికొద్ది రోజులు వేచిచూస్తే తెలుస్తుందని భారత్‌ అభిప్రాయపడింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపనున్నట్టుగా పాక్‌ అగ్రనేత ముషారఫ్‌ ప్రకటించి ఇప్పటికి కేవలం మూడు రోజులు మాత్రమే గడిచిన కారణంగా ఇప్పుడే ముషారఫ్‌ నిజాయితీని అంచనావేయడం సబబు కాదని భారత్‌ అభిప్రాయపడింది.

తన చిత్తశుద్దిని
నిరూపించుకునేందుకు తాము కోరిన 20 మంది నేరగాళ్లను అప్పగించాలని విదేశాంగ మంత్రి జస్వంత్‌సింగ్‌ పాకిస్తాన్‌ను కోరారు. మంగళవారం నాడు ప్రధాని వాజ్‌పేయి అధ్యక్షతన రక్షణ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాత జస్వంత్‌ విలేకరులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్‌ డిమాండ్‌ చేస్తున్న 20 మంది నేరగాళ్లలో దావూద్‌ ఇబ్రహీం వగైరాలను కరాచి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించినట్టుగా తమకు సమాచారం అందిందని ఆయన చెప్పారు. వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించి వచ్చిన హోం మంత్రి అద్వానీ తన పర్యటన విశేషాలను వివరించారు. టెర్రరిజం పోరులో అమెరికా భారత్‌కు పూర్తి దన్నుగా వున్నదని చెప్పారు. బుధవారం నాడు అమెరికా పర్యటనకు బయలుదేరుతున్న రక్షణమంత్రి జార్జ్‌ ఫెర్నాండెజ్‌ తన పర్యటనలో అనుసరించాల్సిన వ్యూహాన్ని గురించి కూడా సమావేశంలో చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో భారత్‌ ప్రతిస్పందన పాకిస్తాన్‌ రానున్న రోజుల్లో తీసుకునే చర్యలపై ఆధారపడి వుంటుందని జస్వంత్‌సింగ్‌ చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X