వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిబ్రవరి 25 నుంచి బడ్జెట్‌ సమావేశాలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు వచ్చే నెల 25వ తేదీన ప్రారంభమవుతాయి. మంగళవారం ఉదయం ప్రధాని వాజ్‌పేయి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ విలేకరులకు చెప్పారు.

2002- 03 సాధారణ బడ్జెట్‌ను ఫిబ్రవరి 28వ తేదీన ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. 27వ తేదీన ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతారు. వీటికి ముందు 26వ తేదీన రైల్వే మంత్రి నితీష్‌కుమార్‌ రైల్వే బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రతిపాదిస్తారు. వీటితో పాటు పలు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు ప్రమోద్‌ మహాజన్‌ చెప్పారు. ఈ సమావేశాలు మే 17వ తేదీ వరకు జరుగుతాయని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X