వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రగులుతున్న భారత్‌-పాక్‌ః పావెల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌ః భారత్‌ పాకిస్తాన్‌ లు పంతాలు వీడి సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోగలవని అమెరికా విదేశాంగ మంత్రి కొలెన్‌ పావెల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉభయ దేశాల మధ్య అణుయుద్ధం జరిగే అవకాశం మాత్రం లేదని ఆయన తెల్చి చెప్పారు. ఇరు దేశాల మధ్య కొద్ది రోజులుగా ఉద్రిక్తత తీవ్రత తగ్గిందని అయితే ఉభయ దేశాలు సరిహద్దు నుంచి దళాలను ఉపసంహరించుకొనేంత వరకు యుద్ధ అవకాశాలను కొట్టిపారేయలేమని పావెల్‌ అన్నారు.

భారత, పాక్‌ లలో పావెల్‌ మంగళవారం నుంచి పర్యటించనున్న సందర్భంగా వాషింగ్టన్‌ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇరుదేశాలు యుద్ధానికి సర్వసన్నద్దంగా వున్న దరిమిలా ఏ క్షణంలో అయినా యుద్ధం బద్దలయ్యే ప్రమాదం వుందన్నారు. పాకిస్తాన్‌ లో తీవ్రవాద శక్తులకు స్థానం లేదని, ఇస్లాం మతం శాంతికి, సహనానికి మారుపేరంటూ ముషారఫ్‌ ప్రకటించడాన్ని పావెల్‌ ప్రశంసించారు. ఇరుదేశాలు సరిహద్దుల్లో మొహరించిన బలగాలను ఉపసంహరించుకోవాలని లేకపోయే ఏదో ఒక క్షణంలో ఘర్షణ చెలరేగే ప్రమాదం వుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X