వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా జోక్యానికి పాక్‌ యత్నం

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల నివారణకు అమెరికా జోక్యాన్ని కోరాలని పాకిస్తాన్‌ నిర్ణయించినట్టుగా తెలిసింది. మూడో పక్షం జోక్యానికి భారత్‌ విముఖంగా వున్నప్పటికీ పాకిస్తాన్‌ మాత్రం అమెరికా సాయం కోరాలనే నిర్ణయించిందని తెలిసింది. అమెరికా విదేశాంగ మంత్రి కొలెన్‌ పావెల్‌ బుధవారం నాడు ఇస్లామాబాద్‌ రానున్న సందర్భంగా పాకిస్తాన్‌ నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది.

ఇస్లామాబాద్‌లో ముషారఫ్‌తోనూ పాక్‌ విదేశాంగ మంత్రి అబ్దుల్‌ సత్తార్‌తోనూ పావెల్‌ సమావేశం అవుతారు. పాక్‌ నుంచి అఎn్గానిస్తాన్‌ అక్కడినుంచి భారత్‌ వెళ్లుతారు. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య చర్చల పునరుద్దరణకు అమెరికా సాయం కోరడానికి ఇదే మంచి అదను అని పాకిస్తాన్‌ భావిస్తున్నట్టుగా తెలిసింది. ఇదిలా వుండగా భారత రక్షణ మంత్రి జార్జ్‌ మాత్రం భారత్‌, పాకిస్తాన్‌ ద్వైపాక్షిక సంబంధాల్లో అమెరికాకు ఎటువంటి పాత్ర లేదని ఖరాఖండిగా చెప్పారు. బుధవారం నాడు జార్జ్‌ అమెరికా పర్యటకు బయలుదేరి వెళ్లుతున్నారు. హోం మంత్రి అద్వానీ అమెరికా పర్యటన నుంచి తిరిగివచ్చిన వెంటనే రక్షణ మంత్రి బయలుదేరి వెళ్లడం గమనార్హం.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X