వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గద్దు: ప్రతిపక్షాలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గుతోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. అమెరికా విదేశాంగ మంత్రి కాలిన్‌ పావెల్‌ సూచనలపై జాగ్రత్త వ్యవహరించాలని ప్రభుత్వానికి సూచించాయి.

కాశ్మీర్‌ సమస్యను సివ్లూ ఒప్పందం పరిధిలో పరిష్కరించాలని కాంగ్రెస్‌ నేత అస్కార్‌ ఫెర్నాండెజ్‌ అన్నారు. ఆగ్రా సదస్సు అనుభవాలను దృష్టిలో వుంచుకునే పాకిస్థాన్‌తో చర్చల విషయంలో భారత ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించడం అవసరమని ఆయన అన్నారు. ఉద్రిక్తతలు తగ్గకుండా, ముందుగా తగిన ఏర్పాట్లు చేసుకోకుండా పాకిస్థాన్‌తో చర్చలు జరపకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

వాజ్‌పేయి ప్రభుత్వం అమెరికాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ప్రధాన కార్యదర్శి ఎ.బి. బర్దన్‌ విమర్శించారు. భారత్‌ తన స్వతంత్ర విధానాన్ని వదిలేసిందని ఆయన అన్నారు. భారత మంత్రుల అమెరికా పర్యటనలను ఆయన తప్పు పట్టారు. నిన్న అద్వానీ వెళ్లారు, నేడు జార్జి ఫెర్నాండెజ్‌ వెళ్లారు, రేపు జస్వంత్‌ సింగ్‌ వెళ్తారు. భారత మంత్రులకు అమెరికా తప్పనిసరిగా సందర్శించాల్సిన మక్కా అయింది ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X