నిమ్స్ డాక్టర్ల సమ్మె
హైదరాబాద్ః ప్రతిష్టాత్మకమైన నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రెసిడెంట్ డాక్టర్లు మరోసారి సమ్మెకు దిగారు. బుధవారం నుంచి డాక్టర్లు ప్రారంభించిన సమ్మె గురువారం నాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జనార్ధన్రెడ్డి స్వయంగా జోక్యం చేసుకున్నా పరిష్కారం కాలేదు. గతంలో తాము సమ్మె చేసినప్పుడు ట్యూషన్ ఫీజు తగ్గిస్తామని హామీ ఇచ్చారని అయితే ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదని రెసిడెంట్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. రెసిడెంట్ డాక్టర్ల ఆకస్మిక సమ్మెతో రోగులు నానా ఇక్కట్లు పడుతున్నారు. మూడేళ్ల క్రితం మూడువేల రూపాయలున్న ఫీజులను ఇప్పుడు ఏకంగా ఏడాదికి యాభై వేల రూపాయలకు పెంచారని రెసిడెంట్స్ ఆరోపిస్తున్నారు. కాగా మూడేళ్ల క్రితం రెసిడెంట్స్కు నెలకు రెండు వేల రూపాయల స్టయిఫండ్ వుంటే ఇప్పుడు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నామని వైద్యంలో సూపర్ స్పెషాల్టీ పట్టాను ఇస్తూ ఎక్కడాలేని విధంగా చదువుకునే విద్యార్ధులకు భారీ మొత్తం స్టయిఫండ్ ఇస్తుంటే తమకు లభించే మొత్తంలో నాలుగోవంతు ట్యూషన్ ఫీజు కింద కట్టడానికి రెసిడెంట్ తిరస్కరించడం ఏమిటని సంస్థ యాజమాన్యం ప్రశ్నిస్తున్నది.
మాత్రం ఎవరూ అందుబాటులో వుండటం లేదని ఆయన ఆరోపించారు.