వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్స్‌ డాక్టర్ల సమ్మె

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ప్రతిష్టాత్మకమైన నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ రెసిడెంట్‌ డాక్టర్లు మరోసారి సమ్మెకు దిగారు. బుధవారం నుంచి డాక్టర్లు ప్రారంభించిన సమ్మె గురువారం నాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జనార్ధన్‌రెడ్డి స్వయంగా జోక్యం చేసుకున్నా పరిష్కారం కాలేదు. గతంలో తాము సమ్మె చేసినప్పుడు ట్యూషన్‌ ఫీజు తగ్గిస్తామని హామీ ఇచ్చారని అయితే ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదని రెసిడెంట్‌ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. రెసిడెంట్‌ డాక్టర్ల ఆకస్మిక సమ్మెతో రోగులు నానా ఇక్కట్లు పడుతున్నారు. మూడేళ్ల క్రితం మూడువేల రూపాయలున్న ఫీజులను ఇప్పుడు ఏకంగా ఏడాదికి యాభై వేల రూపాయలకు పెంచారని రెసిడెంట్స్‌ ఆరోపిస్తున్నారు. కాగా మూడేళ్ల క్రితం రెసిడెంట్స్‌కు నెలకు రెండు వేల రూపాయల స్టయిఫండ్‌ వుంటే ఇప్పుడు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నామని వైద్యంలో సూపర్‌ స్పెషాల్టీ పట్టాను ఇస్తూ ఎక్కడాలేని విధంగా చదువుకునే విద్యార్ధులకు భారీ మొత్తం స్టయిఫండ్‌ ఇస్తుంటే తమకు లభించే మొత్తంలో నాలుగోవంతు ట్యూషన్‌ ఫీజు కింద కట్టడానికి రెసిడెంట్‌ తిరస్కరించడం ఏమిటని సంస్థ యాజమాన్యం ప్రశ్నిస్తున్నది.

గురువారం నాడు రెసిడెంట్స్‌తో మంతనాలు జరిపిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారు కోరిన విధంగా తాము ట్యూషన్‌ ఫీజులను తగ్గించడం లేదా ప్రభుత్వం రీఎంబర్స్‌ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అయితే పట్టా తీసుకున్న తర్వాత కనీసం అయిదేళ్ల పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తామని విద్యార్ధులు హామీ ఇవ్వాలని ప్రతిపాదించారు. రెసిడెంట్‌ డాక్టర్లు ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ప్రభుత్వం ఎంతో ఖర్చుపెట్టి కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, ఆర్దోపెడిక్స్‌లో సూపర్‌ స్పెషలిస్టులను తయారు చేస్తుంటే పట్టా చేతికి రాగానే ప్రైవేట్‌ ప్రాక్టీస్‌తో వీరు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారని సామాన్య ప్రజలకు సేవచేసేందుకు
మాత్రం ఎవరూ అందుబాటులో వుండటం లేదని ఆయన ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X