మధ్యవర్తి పాత్ర పోషించం: పావెల్
ఇస్లామాబాద్:
భారత్,
పాక్ల
మధ్య
సమస్యల
పరిష్కారానికి
మధ్యవర్తి
పాత్ర
పోషించబోమని
అమెరికా
విదేశాంగ
మంత్రి
కాలిన్
పావెల్
స్పష్టం
చేశారు.
కాశ్మీర్
సహా
పలు
అంశాలపై
భారత,
పాక్ల
మధ్య
చర్చలకు
దోహదం
చేసే
ఆలోచనలను
మోసుకుని
తాను
భారత్
వెళ్తున్నట్లు
ఆయన
చెప్పారు.
రెండు
దేశాల
మధ్య
రాజకీయ,
సైనిక
ఉద్రిక్తతలను
సడలింపజేయడమే
తన
తక్షణ
లక్ష్యమని
ఆయన
చెప్పారు.
దక్షిణాసియా
పర్యటనను
పాకిస్థాన్తో
పావెల్
బుధవారంనాడు
ప్రారంభించారు.
కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన అంతకు ముందు వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని విలేకరులు ప్రస్తావిస్తూ కాశ్మీర్లో ప్లెబిసైట్ నిర్వహించాలని భారత్కు సూచిస్తారా అని అడిగితే- అదేమీ లేదు. నిర్దిష్టంగా తాను ఏ సూచన చేయబోను అని జవాబిచ్చారు. కాశ్మీర్ చాలా క్లిష్టమైన అంశం. భారత్, పాక్ల మధ్య చర్చల ద్వారానే ఈ సమస్య పరిష్కారం సాధ్యం. ఈ ప్రక్రియలో ఇంకా చాలా విషయాలు చర్చకు వస్తాయి అని ఆయన అన్నారు.
మాకు
కొన్ని
ఆలోచనలు
ఉన్నాయి.
భారత
నేతలతో
చర్చించిన
తర్వాతనే
వాటిని
మిగతా
ప్రపంచంతో
పంచుకుంటాం
అని
పావెల్
అన్నారు.
భారత్,
పాక్ల
మధ్య
ఉద్రిక్తతలను
తగ్గించడానికి
తాము
రాజకీయ
మార్గాలనే
అనుసరిస్తామని
ఆయన
చెప్పారు.
రెండు
దేశాలు
చర్చలు
ప్రారంభించేలా
చూడడమే
తమ
లక్ష్యమని,
ఈ
రెండు
దేశాలు
తమ
సహాయం
కోరితే
సాయపడేందుకు
సిద్ధంగా
వున్నామని
ఆయన
అన్నారు.