ఎన్టీఆర్ 6వ వర్థంతి- ఘన నివాళి
హైదరాబాద్ః ఆంధ్రుల అభిమాన నటుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 6వ వర్థంతి శుక్రవారం జరిగింది. ట్యాంక్ బండ్ చెందన వున్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు దివంగత నేతకు శ్రద్ధాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని తన మామగారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. పేదలకు వస్త్రాలు పంచిపెట్టారు. ఎన్టీఆర్ అభిమానుల సంఘం నాయకుడు, సనత్ నగర్ ఎమ్మెల్ల్యే శ్రీపతి రాజేశ్వర్ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీని చంద్రబాబు ప్రారంభించారు.
ఎన్టీఆర్
తనయులు,
లక్ష్మీపార్వతి
నివాళి
ఎన్టీఆర్
సతీమణి,
ఎన్టీఆర్
తెలుగుదేశం
పార్టీ
అధినేత్రి
లక్ష్మీపార్వతి
శుక్రవారం
నాడు
ఎన్టీఆర్
సమాధివద్దకు
చేరుకొని
దివంగత
నేతకు
నివాళులు
అర్పించారు.
ఎన్టీఆర్
ఘాట్
వద్ద
ఆమె
గంటకు
పైగా
గడిపారు.
అనంతరం
ఎన్టీఆర్
తనయులు
జయకృష్ణ,
హరికృష్ణ,
బాలకృష్ణ
తదితరులు
తమ
కుటుంబ
సభ్యులతో
సహా
ఎన్టీఆర్
ఘాట్
వద్దకు
విచ్చేసి
నివాళులు
అర్పించారు.