వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమాదం అంచున ప్రపంచంః బుష్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌ః యావత్‌ ప్రపంచం ఊహకుఅందని పెను ప్రమాదాల అంచున వున్నదని అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ ఆందోళన వ్యక్తం చేశారు.సెప్టెంబర్‌ 11 దాడులు జరిగి నాలుగున్నర నెలలు గడిచిన సందర్భంగా మంగళవారం ఆయన కాంగ్రెస్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

మనం ఉగ్రవాదం పై యుద్ధం చేస్తున్నాం.... మన దేశం ఆర్థికసంక్షోభంలో వుంది....యావత్‌ ప్రపంచం ఊహించినపెను ప్రమాదాల అంచున వున్నదన్నారు. ఎన్ని ప్రమాదాలు ఎదురైనా అమెరికా పటిష్టంగానే వుంటుందని బుష్‌ అన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైనప్పటికీ త్వరలో కోలుకుంటుందని బుష్‌ అన్నారు.

అమెరికా ఆర్థిక వ్యవస్థ కుంగి పోవడం, ఆఫ్ఘనిస్తాన్‌ పై యుద్ధం ప్రకటించిన నేపధ్యంలో బుష్‌ ప్రసంగం ఎలా వుంటుందో అనిఅందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అమెరికా ఆర్థిక దుస్థితి ప్రభావం ప్రపంచంలోని ఇతర దేశాలపై కూడా పడిన తరుణంలో బుష్‌ ప్రసంగానికి ఎంతో ప్రాధాన్యత వచ్చింది. అమెరికా భద్రతా సిబ్బంది వేలాది మంది ఉగ్రవాదుల్నిఅరెస్టు చేశారు.... ఇంకా వందలు వేల సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నారు... వారిని కూడా వదిలేది లేదని బుష్‌ అన్నారు.

ఉగ్రవాదులకు యావత్‌ ప్రపంచం యుద్ధ క్షేత్రమేనని అయితే ఉగ్రవాదులు ఎక్కడ వున్నా వారిని ఏరివేయడం అమెరికా బాధ్యత అని బుష్‌ అన్నారు. ఉగ్రవాదులు శిక్షణా కేంద్రాలు నడిచినంత కాలం, ఉగ్రవాదులకు కొన్ని దేశాలు ఆశ్రయం కల్పించడాన్ని అమెరికా, దాని మిత్రదేశాలు ఏ మాత్రం సహించవని బుష్‌ నిర్ద్వంద్వంగా ప్రకటించడంవిశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X