వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాకు పాక్‌ నేరస్తుల జాబితా

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః ప్రస్తుతం అమెరికాలో వుంటున్న కరుడుగట్టిన 8మంది తీవ్రవాదుల జాబితాను పాకిస్తాన్‌ ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ కుఅందజేసింది. ఆ 8 మంది తీవ్రవాదుల్ని తక్షణం పాకిస్తాన్‌ కుఅప్పగించాల్సిందిగా ముషారఫ్‌ ప్రభుత్వం కోరింది. ఎఫ్‌.బి.ఐ. చీఫ్‌ రాబర్ట్‌ ముల్లర్‌ ఇటీవల ఇస్లామాబాద్‌ పర్యటించిన సందర్భంగా ఈఅంశంపై ఒక అవగాహనకు వచ్చి వుంటారని ది న్యూస్‌ పత్రిక బుధవారం వెల్లడించింది. ఇంటర్‌ పోల్‌ రెడ్‌ వారెంట్‌ జారీ చేసిన వ్యక్తులపేర్లు కూడా పాక్‌ అమెరికాకు అందజేసిన జాబితాలో వున్నాయి. ఆఫ్ఘన్‌ యుద్ధంలో అమెరికాకు పూర్తి సహాయ సహకారాలుఅందించనందుకు ప్రతిఫలంగా అమెరికా ఈ తీవ్రవాదుల్ని తమకుఅప్పగిస్తుందని ముషారఫ్‌ ప్రభుత్వం ఆశాభావంతో వుంది.

అయితే పాకిస్తాన్‌ లో వుంటున్న 20 మంది తీవ్రవాదుల్ని తమకుఅప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం ముషారఫ్‌ ప్రభుత్వానికి జాబితా సమర్పించినవిషయం విదితమే. ఆ జాబితాపై ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోని ముషారఫ్‌ ప్రభుత్వం ఇప్పుడు అమెరికాను అటువంటికోరికే కోరడం విశేషం. ఇంటర్‌ పోల్‌ రెడ్‌ వారెంట్‌ జారీ చేసిన ముంబయ్‌ బాంబుపేలుళ్ళ నిందితుడు దావూద్‌ ఇబ్రహీంతో పాటు 20 మందిని తమకుఅప్పగించాల్సిందిగా భారత్‌ పాక్‌ ను కోరిన విషయంవిదితమే.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X