వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రేగిన పాక్‌ -సరిహద్దులో ఉద్రిక్తత

By Staff
|
Google Oneindia TeluguNews

కాశ్మీర్‌ః సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకు పాకిస్తాన్‌సేనలు ఎటువంటి కవ్వింపులు లేకుండానే తూటాలు, శతఘ్నుల వర్షం కురిపించాయి. సుమారు మూడు వేల రౌండ్లు కాల్పులు జరపగా వందల సంఖ్యలో శతఘ్నులను ప్రయోగించారు. ముఖ్యంగా రాజోరి, పూంఛ్‌ జిల్లాల్లో వున్న సరిహద్దు గ్రామాలపై పాక్‌సేనలు విరుచుకు పడ్డాయి.

ఈ కాల్పుల్లో ముగ్గురు భారతీయసైనికులు దుర్మరణం పాలయ్యారు. పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. అయితే పాకిస్తాన్‌ కు భారత్‌సేనలు దీటైన సమాధానం చెప్పాయి. పాక్‌ సేనలు తోక ముడిచేంత వరకు తరిమి కొట్టాయి. పరిస్థితి ఇలా వున్నతరుణంలో సరిహద్దు నుంచి సైన్యాన్ని వెనక్కు తీసుకొనే ప్రసక్తి లేదని రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ శుక్రవారం కొత్తఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో స్పష్టం చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X