వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రికి మహబూబ్‌నగర్‌ కోర్టు షాక్‌

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌ఃషాద్‌నగర్‌ జంటహత్యల కేసులో నిందితునిగా వున్న రాష్ట్ర మంత్రిపొన్నెపురెడ్డి రామసుబ్బారెడ్డి కేసునుంచి మినహాయింపు కోసం పెట్టుకున్న పిటిషన్‌ను మహబూబ్‌నగర్‌లోని రెండవ అదనపు సెషన్స్‌ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో తదుపరి విచారణలో భాగంగా ఏప్రిల్‌ 29 నుంచి మే 7 వకు సాక్షులను విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఇదే కేసుకు సంబంధించిమినహాయింపును కోరుతూ రామసుబ్బారెడ్డి జిల్లా కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను ఆయా కోర్టులు తోసిపుచ్చాయి. తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా తిరిగి మహబూబ్‌నగర్‌ రెండో అదనపుసెషన్స్‌ కోర్టు( ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు)లో పిటిషన్‌ దాఖలు చేశారు.గురువారం నాడు మంత్రి తన అనుచరులతో సహా కోర్టుకుహాజరయ్యారు. మంత్రిపై ఐపిసిసెక్షన్‌ 148,302 కింద కేసులు నమోదయ్యాయి. సిఆర్‌పిసి 227 కింద కేసునుంచిమినహాయింపుకోసం రామసుబ్బారెడ్డి ప్రయత్నాలు చేశారు. వ్యక్తగత స్థాయిలో రామసుబ్బారెడ్డి మాత్రమే కాకుండా ప్రభుత్వం తరఫున కూడా ఆయన్ను కేసునుంచిమినహాయించాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే న్యాయస్థానాలువీటన్నింటినీ కొట్టివేశాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X