వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యపై కేంద్రం నిద్ర

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః అయోధ్య సమస్య పరిష్కారానికి ప్రధాని వాజ్‌పేయి గత ఏడాది కాలంలో ఒక్క సారి కూడా చొరవతీసుకుని ప్రయత్నం చేయలేదని విశ్వహిందూపరిషత్‌ ఆరోపించింది. మేము ఎన్నో ఆశలతో ప్రధానిని కలిసామని అయితే ఉత్తచేతులతోనే వెనక్కి తిరిగిరావల్సివచ్చిందని విహెచ్‌పి నేతలు చెప్పారు. మా డిమాండ్‌లోని న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అంశాలను పరిశీలించాల్సిందిగా న్యాయశాఖను ఆదేశిస్తామని మాత్రమే వాజ్‌పేయి తమకు చెప్పారని విహెచ్‌పి నేత విష్ణు హరి దాల్మియా చెప్పారు.

తాము గడువుఇచ్చి ఏడాది దాటిందని ఏడాది కాలంలో ఏనాడూ కోర్టులనుగానీ న్యాయనిపుణులను గానీ అయోధ్య విషయంలోసలహా అడగని ప్రధాని ఆఖరు క్షణంలో మళ్లీఅదే మాట మాట్లాడటం వింతగా వున్నదని దాల్మియావ్యాఖ్యానించారు.ప్రధాని నిజాయితీగురించి తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదనిఆయన ఒత్తిళ్లు, సమస్యలు ఆయనకుంటాయనిదాల్మియా ఆన్నారు. అయితే గత ఏడాదిగా మాత్రం ప్రభుత్వంఅయోధ్య విషయంలో కునుకుతీస్తున్నదన్నమాట మాత్రం నిజమని ఆయన చెప్పారు. విహెచ్‌పినిఒప్పించే ప్రయత్నాలు కట్టిపెట్టి అవతలి పార్టీకివారికి వారి డిమాండ్‌ అసంబద్దమని వివరించడానికిప్రధాని ప్రయత్నిస్తే బాగుంటుందని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X