వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్టుబడులతో తరలండిః బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

ఫిరోజ్‌ పూర్‌ః జమ్ము కాశ్మీర్‌ లోఅంగుళం నేల కూడా పాకిస్తాన్‌ కు విడిచిపెట్టే ప్రసక్తి లేదని భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌ పేయి స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ కాశ్మీర్‌ దినోత్సవాన్ని జరుపుకోవచ్చు.... అయితే వారికి కాశ్మీర్‌ మాత్రం దక్కదు అను పంజాబ్‌ లో ఎన్నికల ప్రచార సభలో వాజ్‌పేయి తెగేసి చెప్పారు.

సరిహద్దులో ఉభయదేశాలసేనలు వున్నాయి.... ఎవరిమీదో యుద్ధం చేయడానికి సరిహద్దుకు భారతసేనలను తరలించలేదు.. కేవలం మన సరిహద్దును కాపాడుకొనేందుకే ఆ పని చేశాం అని వాజ్‌పేయి వివరించారు. పాకిస్తాన్‌ సీమాంతర ఉగ్రవాదానికిస్వస్తి చెప్పిన మరుక్షణం సరిహద్దు నుంచి దళాలను ఉపసంహరించుకోవడంతో పాటు శాంతి చర్చలు కూడా జరుపుతాం అని ప్రధాని అన్నారు. నేను ప్రధాని బాధ్యతలు చేపట్టిన వెంటనే పాకిస్తాన్‌ తో చెలిమి చేసేందుకు ప్రయత్నించాను... నేనుస్నేహం చేయాలనుకుంటే వాళ్ళు మన పార్లమెంటుపై దాడి చేశారు.... అటువంటి పాకిస్తాన్‌ ను మరో సారి ఎలా నమ్ముతాం అని వాజ్‌పేయి అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X