వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తన పేరుపై అద్వానీ నో కామెంట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

చంఢీఘర్‌: తమకుఅప్పగించాలని భారత్‌కు సమర్పించబోయే పాకిస్థాన్‌ నేరస్థుల జాబితాలో తనపేరు చోటు చేసుకుందనే వార్తలపై హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీ మాట్లాడేందుకు నిరాకరించారు. తమ దేశంలో నేరాలకు పాల్పడి భారత్‌లో తలదాచుకుంటున్న వారి జాబితాను పాకిస్థాన్‌ రూపొందించి వారినిఅప్పగించాలని కోరుతూ భారత్‌కు ఒక జాబితాను సమర్పిస్తామనిఅంటున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో అద్వానీపేరు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

పాకిస్థాన్‌ భారత్‌కు ఒక జాబితా సమర్పిస్తానని అన్నదని, ఇంతవరకు సమర్పించలేదని ఆయన గురువారంమీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో అన్నారు. తాము సమర్పించిన జాబితాలోని పాకిస్థానీ జాతీయులుఆరుగురిపై చర్యలు తీసుకోనున్నట్లు సూచనలుఅందాయని, మిగతా 14 మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని పాకిస్థాన్‌అంటోందని ఆయన అన్నారు.

తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని ఆయన పాకిస్థాన్‌ను డిమాండ్‌ చేశారు. పాకిస్థాన్‌ ప్రేరేపిత లష్కర్‌-ఎ- తోయిబా, జైష్‌- ఎ- మొహ్మద్‌ ఇప్పటికీ సమస్యలు సృష్టిస్తూనే వున్నాయని ఆయన చెప్పారు. తీవ్రవాదులకు ఏ దేశం కూడా ఆశ్రయం కల్పించకూడదని, వారికి శిక్షణ ఇవ్వకూడదని మంత్రి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X