వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బయోటెక్నాలజీతో ఆంధ్రకు మహర్దశ

By Staff
|
Google Oneindia TeluguNews

డబ్లిస్‌ః ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీరంగంతో పాటు బయోటెక్నాలజీ రంగానికి కూడా ఆంధ్రప్రదేశ్‌పెద్దపీట వేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విదేశీ పర్యటనలో వున్న చంద్రబాబు నాయుడు గురువారం ఐర్లాండ్‌ లో ప్యటించారు. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలను కలుసుకొని ఆంధ్రప్రదేశ్‌ లో పెట్టుబడి అవకాశాలను ఆయనవివరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రోడ్‌ షోలను నిర్వహిస్తున్నారు. బయో టెక్నాలజీరంగం, ఇన్సూరెన్స్‌, ఆర్థిక రంగాలకు చెందిన ప్రముఖులతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.

పెట్టుబడులతో తరలి వచ్చే సంస్థలకు హైటెక్‌ సిటీలో అన్ని సౌకర్యాలను సమకూర్చుతామని, పలు రాయితీలు కూడా ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తన పర్యటన వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఉపాధి అవకాశాలుపెరిగేఅవకాశం వున్నట్లు చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో పెట్టుబడులుపెట్టేందుకు విదేశీ పారిశ్రామిక వేత్తలు, ప్రవాస భారతీయులు ఆసక్తి చూపుతున్నారని చంద్రబాబు నాయుడు న్యూయార్క్‌ నుంచి ఆంధ్రరాష్ట్రంలోని ఎలక్ట్రానికి మీడియాతో ఫోన్‌ లో మాట్లాడుతూవివరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X