వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వార్కు దొరరాజకీయ సూచనలు
కరీంనగర్:
పీపుల్స్వార్
గ్రూప్
ఆయుధాలకుస్వస్తి
చెప్పి
రాజకీయ
పార్టీగా
అవిర్భవించాలని
రాష్ట్ర
పోలీసు
డైరెక్టర్
జనరల్
హె.జె.
దొర
సూచించారు.
కరీంనగర్
జిల్లాలోని
కాటారం
పోలీసుస్టేషన్
భవనాన్ని
బుధవారం
ప్రారంభించిన
అనంతరం
ఆయనవిలేకరులతో
మాట్లాడారు.
పీపుల్స్వార్తో
చర్చలవిషయంలో
ప్రభుత్వానిదే
తుది
నిర్ణయమని,
ఇందులో
పోలీసులకు
జోక్యం
వుండదని
ఆయన
స్పష్టం
చేశారు.
పీపుల్స్వార్ చర్చల్లో పాల్గొనాలంటే ఆయుధాలు వీడి జన జీవన స్రవంతిలో కలవాలని ఆయన అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్వహించిన రావి నారాయణ రెడ్డి, పుచ్చపల్లి సుందరయ్య లాంటి నేతలు తర్వాత రాజకీయ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసివిజయాలు సాధించారని, పీపుల్స్వార్కు కూడా అటువంటి అవకాశం ఉన్నదని ఆయన అన్నారు. దాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
Comments
Story first published: Thursday, February 7, 2002, 23:53 [IST]