వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌తో క్రికెట్‌ ఆడుతాం: ముషారఫ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: భారత్‌తో క్రికెట్‌ ఆడేందుకు తమ జట్టు ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధమేనని, భారత్‌లో ఆడేందుకు కూడా తమ క్రికెట్‌ జట్టు సిద్ధపడుతుందని పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషారఫ్‌ అన్నారు. ఇటీవల కౌలాలంపూర్‌లో జరిగిన ఆరు దేశాల హాకీ టోర్నమెంట్‌లో గెలుపొందిన పాక్‌ జట్టును బుధవారం ఆయన అభినందించారు. ఆ తర్వాత ఆయనవిలేకరులతో మాట్లాడారు.

క్రీడలకు రాజకీయాలతో ముడిపెట్టరాదని ఆయన భారత నాయకులకు సూచించారు. భారత్‌తో తాము చర్చలకు సిద్ధమేనని, అదే విధంగా క్రికెట్‌ బంధాన్ని కూడా పునరుద్ధరించుకునేందుకు సిద్ధంగా వున్నామని ఆయన చెప్పారు.

1999 కార్గిల్‌ యుద్ధానంతరం భారత క్రికెట్‌ జట్టు పాకిస్థాన్‌ జట్టుతో ఆడకూడదని నిర్ణయించుకుంది. ఇరు దేశాల మధ్య జరగాల్సిన షార్జా క్రికెట్‌ పోటీల నుంచి భారత్‌ తప్పుకుంది. పాక్‌ భాగస్వామిగా వున్నందున ఇక్కడే జరిగిన మూడు దేశాల వన్డే సిరీస్‌లో కూడా భారత్‌ పాల్గొనలేదు. 2000- 01లో పాక్‌ పర్యటనను భారత క్రికెట్‌ జట్టు రద్దు చేసుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X