రైతుల ఆత్మహత్యలపై వైయస్ ఫిర్యాదు
హైదరాబాద్:
రాష్ట్రంలో
రైతుల
ఆత్మహత్యల
సంఘటనలను
మానవ
హక్కుల
ఉల్లంఘనగా
ప్రకటించాలని
ప్రతిపక్ష
నాయకుడు
డాక్టర్
వై.యస్.
రాజశేఖర్
రెడ్డి
జాతీయ
మానవ
హక్కుల
కమిషన్కువిజ్ఞప్తి
చేశారు.
సంబంధిత
రైతు
కుటుంబాలకు
తగిన
నష్టపరిహారం
ప్రభుత్వం
చెల్లించే
విధంగా
చర్యలు
తీసుకోవాలని
ఆయనకోరారు.
కమిషన్
ఆదేశం
మేరకు
రైతుల
ఆత్మహత్యలపై
ప్రభుత్వం
ఒక
నివేదిక
పంపింది.
ఈ
నివేదికపై
స్పందన
కోరుతూ
గత
డిసెంబర్
31వ
తేదీన
కాంగ్రెస్
లెజిస్లేచర్
పార్టీకి
కమిషన్
ఒక
లేఖ
రాసింది.
దీనికి
జవాబుగా
ప్రభుత్వ
నివేదికపై
బుధవారం
కమిషన్
చైర్మన్కు
రాజశేఖర్
రెడ్డి
ఒక
లేఖరాశారు.
పంట నష్టం కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదని, వ్యక్తిగత ఆర్థిక నష్టాల వల్లనే ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వం వ్యక్తీకరించిన అభిప్రాయంలో ఏ మాత్రం వాస్తవం లేదని రాజశేఖర్ రెడ్డి అన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వంవిఫలమైందని ఆయన అన్నారు. రైతుల ఆత్మహత్యలపై కమిషన్ జరుపుతున్నవిచారణ తదుపరి తేదీలు ప్రకటిస్తే వాస్తవాలను వెలికి తీయడంలో సహకరించేందుకు కాంగ్రెస్ తరఫున ఒకరిని పంపుతామని ఆయన చెప్పారు.