వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుల ఆత్మహత్యలపై వైయస్‌ ఫిర్యాదు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల సంఘటనలను మానవ హక్కుల ఉల్లంఘనగా ప్రకటించాలని ప్రతిపక్ష నాయకుడు డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి జాతీయ మానవ హక్కుల కమిషన్‌కువిజ్ఞప్తి చేశారు. సంబంధిత రైతు కుటుంబాలకు తగిన నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయనకోరారు. కమిషన్‌ ఆదేశం మేరకు రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఒక నివేదిక పంపింది. ఈ నివేదికపై స్పందన కోరుతూ గత డిసెంబర్‌ 31వ తేదీన కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీకి కమిషన్‌ ఒక లేఖ రాసింది. దీనికి జవాబుగా ప్రభుత్వ నివేదికపై బుధవారం కమిషన్‌ చైర్మన్‌కు రాజశేఖర్‌ రెడ్డి ఒక లేఖరాశారు.

ఆత్మహత్యలవిషయంలో ప్రభుత్వం అసలు సమస్యను తడమకుండా, పూర్తి స్థాయిలో వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రభుత్వం కమిషన్‌కు నివేదికఅందజేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. కమిషన్‌ను సైతం తప్పు దోవ పట్టించే విధంగా ప్రభుత్వంవ్యవహరించిందని ఆయన విమర్శించారు. వివిధ చట్టాల ప్రకారం రైతులను ఆదుకోవడంలోవిఫలమైనందున నష్ట పరిహారం ప్రభుత్వమే చెల్లించాలని ఆయన అన్నారు.

పంట నష్టం కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదని, వ్యక్తిగత ఆర్థిక నష్టాల వల్లనే ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వం వ్యక్తీకరించిన అభిప్రాయంలో ఏ మాత్రం వాస్తవం లేదని రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వంవిఫలమైందని ఆయన అన్నారు. రైతుల ఆత్మహత్యలపై కమిషన్‌ జరుపుతున్నవిచారణ తదుపరి తేదీలు ప్రకటిస్తే వాస్తవాలను వెలికి తీయడంలో సహకరించేందుకు కాంగ్రెస్‌ తరఫున ఒకరిని పంపుతామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X