వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుపిలో బిజెపి ప్రతిపక్ష పాత్ర

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాంచల్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో ప్రతిపక్షంలోనే కూర్చోవాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నిర్ణయించుకుంది. ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి నివాసంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని బిజెపి అధ్యక్షుడు జనా కృష్ణమూర్తి సోమవారంవిలేకరుల సమావేశంలో ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్‌లో బహుజన సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి)కి బిజెపి వెలుపలి నుంచి మద్దతు తెలియజేస్తుందా అని అడిగితే తాము వెలుపలి నుంచి ఎవరికీ మద్దతు ఇవ్వబోమని ఆయన జవాబిచ్చారు. తాము ప్రతిపక్షంగానే పని చేయదల్చుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

ప్రధానితో పాటు ఈ సమావేశంలో హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉత్తరప్రదేశ్‌ బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కల్‌రాజ్‌మిశ్రా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్‌ మహాజన్‌, పార్టీ మాజీ అధ్యక్షుడు కుశభావ్‌ ఠాక్రే పాల్గొన్నారు.

మూడు రాష్ట్రాల్లోని పోలింగ్‌ అనంతర పరిస్థితిని గంట పాటు సమీక్షించిన పార్లమెంటరీ బోర్డు సమావేశం ప్రజాతీర్పును మన్నించడమే కాకుండా గౌరవించాలని నిర్ణయించినట్లు కృష్ణమూర్తి చెప్పారు.ప్రజలు మూడు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష బాధ్యతను తమకుఅప్పగించారని, తాము ప్రతిపక్ష బాధ్యతను నిర్వర్తిస్తామని ఆయన అన్నారు.

సమావేశం నుంచి బయటకు వచ్చిన రాజ్‌నాథ్‌ సింగ్‌- బిఎస్‌పి నేత మాయావతితో తమకు చర్చలు లేవని, తాము ఎవరినీ బలపరచబోమని, తాము ప్రజాతీర్పునుఅంగీకిరంచి ప్రతిపక్షంలో కూర్చుంటామని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X