వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్ని జిల్లాల్లో పేదరిక నిర్మూలన పథకం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్రంలోపేదరిక నిర్మూలనకు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్రఉపాధి శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆరు జిల్లాలకే పరిమితంఅయిన డి.పి.ఐ.పి. పధకాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తింప చేస్తున్నామని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రజల ఉద్ధరణకు పలు చర్యలు చేపడతున్నామంటూ ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వంబడ్జెట్‌ లో నామమాత్రంగా నిధులు కేటాయించిందంటూ ప్రతిపక్షాలు సోమవారం నాడుఅసెంబ్లీలో ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి.

ఇందుకు ఉపాధి కల్పనా శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ డిపిఐపి పధకం అమలుకు మరో రెండు వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ప్రపంచబ్యాంక్‌అంగీకరించిందన్నారు. 580 కోట్ల రూపాయలతో తలపెట్టిన వెలుగు పధకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు కూడా మంత్రివివరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X