వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్‌పి శాసనసభా పక్ష నేత ములాయం

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్‌ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) శాసనసభ్యులు తమ శాసనసభా పక్ష నాయకుడిగా ములాయం సింగ్‌ను ఎన్నుకున్నారు. లక్నో సమాజ్‌వాదీ పార్టీ శాసనసభ్యులు మంగళవారం సమావేశమై తమ నాయకుడ్ని ఎన్నుకున్నారు.

అత్యధిక స్థానాలు గెల్చుకున్న పార్టీ తమదేఅయినందున తమను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించాలని ములాయం సింగ్‌ అన్నారు. తమ మెజారిటీని సభలో నిరూపించుకుంటామని ఆయన చెప్పారు. తమకు ఇండిపెండెంట్ల, ఇతర చిన్న గ్రూప్‌ల మద్దతు ఉన్నదని ఆయనఅంటున్నారు. ఉత్తరప్రదేశ్‌ బిజెపి శాసనసభ్యులు తమ నాయకుడిగా రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఎన్నుకున్నారు.ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సమాజ్‌ వాది పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఆ పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ మంగళవారం రాష్ట్రగవర్నర్‌ ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా వున్నదని చెప్పారు. సమాజ్‌ వాది పార్టీ పూర్తి మెజారిటీ సాధించినప్పటికీ అతిపెద్దపార్టీగా అవతరించిన విషయం విదితమే. బిఎస్పి మద్దతు ఇస్తే తప్ప సమాజ్‌ వాది పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు.

ప్రతిపక్షంలో కూర్చొనేందుకే భారతీయ జనతాపార్టీ తీర్మానించుకోవడంతో ఇప్పుడు సమాజ్‌ వాది పార్టీ రంగంలోకి దిగింది. మాయావతి మద్దతు కోసం మంతనాలు ప్రారంభించింది. మరో వైపు హంగ్‌అసెంబ్లీ ఏర్పడినందున ఏంచేయాలనే విషయంపై గవర్నర్‌ రాజ్యాంగ నిపుణులతో చర్చలు ప్రారంభించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X