వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కొత్త బడ్జెట్ లో 16 ఇంటర్ సిటీరైళ్ళు
న్యూఢిల్లీః దేశంలోని వివిధ ప్రధాన పట్టణాల మధ్య తిరిగే 16 ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లను జనశతాబ్ది ఎక్స్ ప్రెస్ ల పేరిట రైల్వే శాఖ మంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ 16 రైళ్లు ప్రస్తుతం శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో వున్న సౌకర్యాలను కలిగివుంటాయని, ప్రత్యేకంగా రూపొందించిన సెకండ్ క్లాస్ చైర్ కార్ వసతి కూడా ఈ రైళ్ళలో వుంటాయని నితీష్కుమార్ ప్రకటించారు.
1. మడ్ గావ్ - ముంబయ్
2. గౌహతి - దిమాపూర్
3. రాఘర్ - రాయ్ పూర్ - దుర్గ్
4. అహ్మదాబాద్ - భుజ్
5. టాటానగర్ - రాంచి
6. బెంగుళూరు - హుబ్లి
7. ఎర్నాకులం - త్రివేండ్రం
8. కోట - నిజాముద్దీన్
9. భువనేశ్వర్ - హౌరా
10. డెహ్రాడూన్ - న్యూఢిల్లీ
11. హౌరా - మార్డా టౌన్
12 వారణాసి - లక్నో
13. చండీఘర్ - న్యూఢిల్లీ
14. చెన్నై - విజయవాడ (వయా గూడూరు)
15. హబీబ్ నగర్ - జబల్ పూర్
16. కతిహార్ - పాట్నా
ఇవి కాక మరో 25 కొత్త రైళ్ళను మంత్రి ప్రకటించారు. దుర్గ్ - బెంగుళూరు(వయా. గోండియా, చందాఫోర్ట్) - సింకింద్రాబాద్ మధ్య నడిచే రైలు వీటిలో ఒకటి. కొత్త రైళ్ళలో ఇదొకటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినది.
Comments
Story first published: Tuesday, February 26, 2002, 23:53 [IST]