వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నారాయణన్‌ ప్రసంగంపై పాక్‌ ఆగ్రహం

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః భారత రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని పాకిస్తాన్‌ ప్రభుత్వం తప్పు పట్టింది. రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించిన కొన్ని అంశాలను దురదృష్టకరమైనవిగా పాక్‌ అభివర్ణించింది. భారత పార్లమెంటుపై డిసెంబర్‌ 13న జరిగిన దాడిలో పాకిస్తాన్‌ హస్తం లేదని పాక్‌ రక్షణ శాఖ ప్రతినిధి రషీద్‌ ఖురేషీ స్పష్టం చేశారు. భారత్‌ ఒత్తిడి చేసినంత మాత్రాన తలఒగ్గి చర్చలు జరిపేది లేదని ఆయన అన్నారు.

భారత రాష్ట్రపతి ప్రసంగం దూకుడుగా, రెచ్చకొట్టేదిగా వున్నదని మంగళవారం జరిగినవిలేకరుల సమావేశంలో ఖురేషీ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌ తో చర్చలు జరపాల్సిందిగా యావత్‌ ప్రపంచం భారత్‌ కు హితవు చెబుతున్నా భారత్‌ దూకుడు తగ్గించుకోలేదన్నారు. తీవ్రవాదాన్ని నిర్మూలించాలనేదే పాకిస్తాన్‌ అభిమతమని, ఆ సిద్ధాంతానికి పాకిస్తాన్‌ ఎప్పుడూ కట్టుబడి వుంటుందని ఖురేషీ అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X