వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకాశంలో హై డ్రామా

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌ః హింసాకాండతో అల్లకల్లోలంగా మారిన గుజరాత్‌లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు. బుధవారం నుంచి ప్రారంభమైన హింసాకాండలో ఇప్పటివరకు 140 మంది పైగా మరణించినట్టుగా వార్తలు వచ్చాయి. శుక్రవారం ఉదయం కూడా పరిస్థితిలో మార్పులేదు.

గురువారం నాడు అహ్మదాబాద్‌లో మాజీ ఎంపీ అహ్సన్‌ జఫ్రీ ఇంటికి కొందరు దుండగులు నిప్పుపెట్టిన సంఘటనలో జఫ్రితో సహా ఆయన కుటుంబ సభ్యులు 20 మంది మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. అహ్మదాబాద్‌లో శుక్రవారం అడుగుపెట్టిన వెంటనేసైనిక దళాలు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించాయి. గోద్రారైల్వే స్టేషన్‌లో కొందరు ఉన్మాదులు సబర్మతిరైలుకు నిప్పుపెట్టిన సంఘటనలో 60 మందిపైగా కార్‌సేవకులు సజీవ దహనం కావడంతో రాష్ట్రంలో మతకల్లోలాలు చెలరేగాయి.గురువారం రాత్రంతా అనేక ప్రాంతాల్లో హింసా, దహనకాండ విచ్చలవిడిగా కొనసాగుతునే వున్నాయి. గురువారం రాత్రి అహ్మదాబాద్‌కు చేరుకున్న రక్షణ మంత్రి జార్జ్‌ ఫెర్నాండెజ్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడితో మంతనాలు జరిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X