వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాతబస్తీలో ఉద్రిక్తత-పోలీస్టేషన్‌ పై దాడి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః గుజరాత్‌ అల్లర్లకు నిరసనగావిశ్వహిందూ పరిషత్‌ ఇచ్చిన బంద్‌ పిలుపు సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌ లో ఉద్రిక్తత నెలకొంది. పాతబస్తీలో అల్లరి మూకలు రాళ్ళు రువ్వుకున్నాయి. ఓ వర్గానికి చెందిన సుమారు 500 మంది భవానీ నగర్‌ పోలీస్టేషన్‌ పై దాడి చేశారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. కొందరు పోలీసులు ఈ దాడిలో గాయపడ్డారు. అల్లరి మూకల్ని చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.

చార్మినార్‌ పక్కన వున్న మక్కా మసీదులో ప్రార్థనలు ముగించుకు వస్తున్న వారు రాళ్ళు రువ్వడం ప్రారంభించారు. చార్మినార్‌ వైపు కొందరు దూసుకురావడం ప్రారంభించడంతో ముస్లిం నేతలు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు అడ్డుకోవడంతో చార్మినార్‌ వైపు వచ్చేందుకు ప్రయత్నించిన 500 మంది కార్యకర్తలు భవానీ నగర్‌ దిశగా వెళ్ళి అక్కడి పోలీస్టేషన్‌ పై దాడి చేశారు. పోలీసులు కాల్పులు జరపడంతో కార్యకర్తలు పరారయ్యారు.

భారత్‌ బంద్‌ సందర్భంగా రాష్ట్రంలో బంద్‌ పాక్షింకంగా జరిగినప్పటికీ పోలీసులు 2 వేల మందిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 25 బస్సులు ధ్వంసమయ్యాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X