ఆలయం వాయిదాకు వి.హెచ్.పి. ఓకె
న్యూఢిల్లీః
మూడు
నెలల
తరువాత
అయోధ్యలో
ఆలయ
నిర్మాణానికి
అనుమతిస్తామని
కేంద్ర
ప్రభుత్వం
హామీ
ఇస్తే
ఉద్యమాన్నివాయిదా
వేసే
విషయాన్ని
పరిశీలిస్తామని
ఆర్ఎస్ఎస్
ప్రకటించింది.
అయోధ్యలోని
వివాదాస్పద
స్థలంలో
మార్చి
15న
రామమందిర
నిర్మాణం
ప్రారంభిస్తామని
భీషణ
ప్రతిజ్ఞ
చేసిన
విశ్వహిందూ
పరిషత్
శుక్రవారం
కాస్త
మెత్తపడింది.
ఆరునూరైనా
ఆలయ
నిర్మాణం
ఆగదంటూ
విశ్వహిందూ
పరిషత్
ప్రధాని
వాజ్
పేయికి
తెగేసి
చెప్పిన
విషయం
విదితమే.
అయితే
కొన్ని
షరతులకు
లోబడి
ఆలయ
నిర్మాణాన్ని
వాయిదా
వేసుకొనేందుకు
సిద్ధంగా
వున్నట్లు
ఆర్.ఎస్.ఎస్.
నేత
ఆచార్య
గిరిరాజ్
కిషోర్
శుక్రవారం
కొత్తఢిల్లీలో
వెల్లడించారు.
అయోధ్య
వ్యవహారంపై
వాజ్
పేయి
మొదటి
నుంచి
మొండిగా
వున్నారని,
ఆయన
సహకరిస్తే
వ్యవహారం
ఇంతదాకా
వచ్చేది
కాదని
గిరిరాజ్విమర్శించారు.
మొత్తం
మీద
వి.హెచ్.పి.
దౌత్యం
ఫలించి
ఆర్.ఎస్.ఎస్.
కాస్త
మెత్తబడింది.