వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆలయం వాయిదాకు వి.హెచ్‌.పి. ఓకె

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః మూడు నెలల తరువాత అయోధ్యలో ఆలయ నిర్మాణానికి అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తే ఉద్యమాన్నివాయిదా వేసే విషయాన్ని పరిశీలిస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటించింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో మార్చి 15న రామమందిర నిర్మాణం ప్రారంభిస్తామని భీషణ ప్రతిజ్ఞ చేసిన విశ్వహిందూ పరిషత్‌ శుక్రవారం కాస్త మెత్తపడింది.
ఆరునూరైనా ఆలయ నిర్మాణం ఆగదంటూ విశ్వహిందూ పరిషత్‌ ప్రధాని వాజ్‌ పేయికి తెగేసి చెప్పిన విషయం విదితమే. అయితే కొన్ని షరతులకు లోబడి ఆలయ నిర్మాణాన్ని వాయిదా వేసుకొనేందుకు సిద్ధంగా వున్నట్లు ఆర్‌.ఎస్‌.ఎస్‌. నేత ఆచార్య గిరిరాజ్‌ కిషోర్‌ శుక్రవారం కొత్తఢిల్లీలో వెల్లడించారు.

మూడు నెలల తరువాత ఆలయ నిర్మాణానికి అనుమతిస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ లోగా ఆలయ నిర్మాణం కోసం చెక్కినవిగ్రహాలు, స్తంభాలను తరలించేందుకు అనుమతించాలని, అయోధ్యలో వంద రోజల పాటు పూజలు, యజ్ఞాలు నిర్వహించేందుకు అనుమతించాలివిశ్వహిందూ పరిషత్‌ షరతులు విధించింది.

అయోధ్య వ్యవహారంపై వాజ్‌ పేయి మొదటి నుంచి మొండిగా వున్నారని, ఆయన సహకరిస్తే వ్యవహారం ఇంతదాకా వచ్చేది కాదని గిరిరాజ్‌విమర్శించారు. మొత్తం మీద వి.హెచ్‌.పి. దౌత్యం ఫలించి ఆర్‌.ఎస్‌.ఎస్‌. కాస్త మెత్తబడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X