వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్నోలో ప్రమాదం: 21 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో: లక్నోలోని ఆర్మీ రిక్రూట్‌మెంట్‌సెంటర్‌లో సీవరేజ్‌ డ్రెయిన్‌లో పడి 21 మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురువారం తెల్లవారు జామున సంభవించింది.ఈ ప్రమాదంలో 21 మంది చనిపోయారని అధికారులు చెప్పుతున్నారు. అయితే, మృతుల సంఖ్య 40 నుంచి 50 దాకా వుండచ్చునని అనధికార వర్గాల అంచనా. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని భావిస్తున్నారు.

ప్రమాదంతో ఆగ్రహం చెందిన యువకులు విధ్వంసానికి దిగారు. బ్రిడ్జి కూలిపోవడంతో ఆర్మి రిక్రూట్‌మెంట్‌కు వచ్చిన యువకులు డ్రైనేజీలో పడ్డారు. ఈ ప్రమాదం గురువారం ఉదయం ఐదు, ఐదున్నర గంటల మధ్య జరిగింది.

మరణించివారందరూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రిక్రూట్‌మెంట్‌ పరీక్షకుహాజరయినవారు. వారంతా యువకులే. భూగర్భంలోసీవరేజ్‌ డ్రెయిన్‌ ఉన్నదనే విషయం ఎవరికీ తెలియదు. ప్రాథమిక ఫిజికల్‌ ఎగ్జామినేషన్‌ కోసం వేలాది మంది అక్కడ గుమికూడారు.

మృతదేహాలను అన్నింటినీ వెలికి తీశారు. గాయపడిన ముగ్గురినిసైనిక ఆస్పత్రిలో చేర్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన పలువురి ప్రథమ చికిత్స చేసిపంపేశారు. మరణించివారి బంధువులకు సమాచారంఅందించడానికి పాలనా యంత్రాంగం, సైనిక అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నాయి. చాలా మంది పొరుగు జిల్లాల నుంచి వచ్చి వుంటారని భావిస్తున్నారు. రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు ఇక్కడ జరుగుతూనే వుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X