వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆపితే ఆత్మహత్య: పరమహంస

By Staff
|
Google Oneindia TeluguNews

అయోధ్య: శిలాదానం చేయకుండా మార్చి 15వ తేదీన అడ్డుకుంటే తాను ప్రాణత్యాగం చేస్తానని రామ జన్మభూమి న్యాస్‌ అధ్యక్షుడు పరమహంస రామచంద్ర దాస్‌ హెచ్చరించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో భాగంగా ఆయన గురువారం ఈ హెచ్చరిక చేశారు.

నిర్ణీత కార్యక్రమం ప్రకారం తాను వర్క్‌షాపు నుంచి వెళ్లకుండా అడ్డుకుంటే రసాయనం తాగి రాముడికోసం, దేవాలయం కోసం ప్రాణ త్యాగం చేస్తానని ఆయన అన్నారు. అయోధ్యలో వర్క్‌షాపును ఆయన తన తాత్కాలిక నివాసం చేసుకున్నారు.

బయటకు అడుగు పెట్టకుండా తనను అడ్డుకుంటే తాను జైలుకు పోవడానికి, భద్రతా బలగాలు లాఠీదెబ్బలు, బుల్లెట్లు తినడానికి సిద్ధపడతానని ఆయన అన్నారు.

హిందూ భక్తుడిగా పూజ నిర్వహించడం తన జన్మహక్కు అని ఆయన చెప్పారు. శిలాదానం చేయడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడం ఏమీ కాదని ఆయన అన్నారు. యథాతద స్థితిని ఉల్లంఘించడం కూడా కాదని ఆయన చెప్పారు.

ఈ తరుణంలో తాను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిలో కొంత భాగం ఇవ్వాలని గానీ, దేవాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని గానీ అడగడం లేదని, తాను కేవలం శిలాదానం చేయాలనుకుంటున్నానని, దీన్ని ప్రతిపాదిత దేవాలయ నిర్మాణానికి వాడుతామని ఆయన అన్నారు.

పరమహంస రామచంద్ర దాసును బుజ్జగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విహెచ్‌పి వర్క్‌షాపులో ఆయనతో పలువురు ప్రభుత్వాధికారులు రహస్యంగా సమావేశమవుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X