ఆపితే ఆత్మహత్య: పరమహంస
అయోధ్య:
శిలాదానం
చేయకుండా
మార్చి
15వ
తేదీన
అడ్డుకుంటే
తాను
ప్రాణత్యాగం
చేస్తానని
రామ
జన్మభూమి
న్యాస్
అధ్యక్షుడు
పరమహంస
రామచంద్ర
దాస్
హెచ్చరించారు.
ప్రభుత్వంపై
ఒత్తిడి
తేవడంలో
భాగంగా
ఆయన
గురువారం
ఈ
హెచ్చరిక
చేశారు.
బయటకు అడుగు పెట్టకుండా తనను అడ్డుకుంటే తాను జైలుకు పోవడానికి, భద్రతా బలగాలు లాఠీదెబ్బలు, బుల్లెట్లు తినడానికి సిద్ధపడతానని ఆయన అన్నారు.
హిందూ భక్తుడిగా పూజ నిర్వహించడం తన జన్మహక్కు అని ఆయన చెప్పారు. శిలాదానం చేయడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడం ఏమీ కాదని ఆయన అన్నారు. యథాతద స్థితిని ఉల్లంఘించడం కూడా కాదని ఆయన చెప్పారు.
ఈ తరుణంలో తాను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిలో కొంత భాగం ఇవ్వాలని గానీ, దేవాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని గానీ అడగడం లేదని, తాను కేవలం శిలాదానం చేయాలనుకుంటున్నానని, దీన్ని ప్రతిపాదిత దేవాలయ నిర్మాణానికి వాడుతామని ఆయన అన్నారు.
పరమహంస రామచంద్ర దాసును బుజ్జగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విహెచ్పి వర్క్షాపులో ఆయనతో పలువురు ప్రభుత్వాధికారులు రహస్యంగా సమావేశమవుతున్నారు.